DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్‌డౌన్ గడువు సమీపిస్తున్నతరుణంలో కేంద్రం కీలక ప్రకటన

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 29, 2020 (డిఎన్ఎస్): దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉపాధి లేకపోవడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు

అనుమతి లేక, ఉన్న చోట నానా అవస్థలు పడుతున్న వలస కార్మికులకు భారీ ఊరట కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో

ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు, యాత్రికులు, విద్యార్థులు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన

విడుదల చేసింది. వారిని తరలించేందుకు బస్సులను వినియోగించుకోవాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచన చేసింది.

ఆ బస్సులను శానిటైజ్ చేయాలని, బస్సుల్లో

కూర్చునే వ్యక్తులు భౌతిక దూరం పాటించాలని కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే.. తరలించే ప్రతీ వ్యక్తికి స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని.. కరోనా

లక్షణాలు లేని వ్యక్తులనే తరలించాలని కేంద్రం స్పష్టం చేసింది. స్వస్థలాలకు వెళ్లిన ప్రతీ ఒక్కరూ హోం క్వారంటైన్ పాటించేలా స్థానిక వైద్య అధికారులు బాధ్యత

తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం తాజా ప్రకటనతో.. పలు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతున్న లక్షల మంది వలస కార్మికులకు, యాత్రికులకు,

విద్యార్థులకు ఊరట లభించినట్టయింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam