DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం కంటైన్మెంట్ జోన్ లో ఏర్పాట్లు జేసీ ఎస్పీ ల పరిశీలన

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 29, 2020 (డిఎన్ఎస్) : à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ పట్టణంలో పిఎన్ కాలనీ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ à°—à°¾

ప్రకటించడం, గత రెండు రోజుల క్రితం పాతపట్నం ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించడంతో అధికారులు కంటైన్మెంట్ జోన్లో ఏర్పాట్లను బుధ వారం పరిశీలించారు. జాయింట్

కలెక్టర్ డా కె. శ్రీనివాసులు, పోలీసు సూపరింటిండెంట్ ఆర్.ఎన్.అమ్మి రెడ్డి పి.ఎన్.కాలనీలో పర్యటించి కంటైన్మెంటు ప్రణాళికలను పరిశీలించారు. కంటైన్మెంటు

ప్రాంతం నుండి ఏ ఒక్కరూ రాకపోకలు సాగించకూడదు. అదే సమయంలో ఆ ప్రాంతవాసులకు తాగు నీరు, నిత్యావసరాలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చేపట్టిన చర్యలు, ఇంకా

తీసుకోవలసిన చర్యలను గూర్చి పరిశీలించారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, కిరాణా సామగ్రి ఇంటింటికి పంపిణీ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు స్వయంగా

పర్యవేక్షించారు. బందోబస్తు తదితర ఏర్పాట్లను పోలీసు సూపరింటిండెంట్ ఆర్.ఎన్.అమ్మి రెడ్డి పర్యవేక్షించారు. ఇది ఇలా ఉండగా ఇంటింటి సర్వే శరవేగంగా చేస్తూ

రాపిడ్ టెస్ కిట్లతో వైద్య బృందాలు పరీక్షిస్తున్నాయి. నగర పాలక సంస్ధ పారిశుధ్య పనులను మరింత వేగవంతం చేసింది. పాతపట్నం రెడ్ జోన్ ప్రాంతంలో జిల్లా పంచాయతీ

అధికారి వి.రవికుమార్ నేతృత్వంలో పారిశుధ్య పనులు జరుపుతున్నారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయడం, బ్లీచింగు చల్లడం ద్వారా పారిశుధ్యాన్ని పెద్ద

ఎత్తున చేపడుతున్నారు. రెడ్ క్రాస్ సంస్ధ పి.ఎన్.కాలనీ ప్రాంతంలో పని చేస్తున్న పోలీసులు, సచివాలయం సిబ్బంది, మునిసిపల్ సిబ్బందికి శానిటైజర్లు పంపిణీ చేయడం

జరిగింది. లాక్ డౌన్ కారణంగా  à°‡à°¬à±à°¬à°‚ది పడుతున్న ఆసుపత్రిలో రోగులకు, వారి సహాయకులకు, యాచకులు, ఫోన్ ద్వారా ఆహారం కోరిన వృద్ధులు, నిస్సహాయులకు  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్

ఆదేశాల మేరకు ఆహార పొట్లాలను పంపిణీ చేయడం జరిగింది.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ పట్టణంతోపాటు వివిధ మండల ప్రాంతాలలో భవాని చారిటబుల్ ట్రస్ట్ సరఫరా చేసిన వెయ్యి ప్యాకెట్లు,

రెడ్ క్రాస్ జిల్లా శాఖ ద్వారా రెండు వందలు, రెడ్ క్రాస్ పొందూరు సబ్ బ్రాంచ్ ద్వారా 120, అక్షయ పాత్ర ద్వారా 850 మందికి ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగినది. కంటైన్మెంటు

జోన్ లలో ప్రజలు అందరూ ఇళ్ళల్లోనే ఉండాలని, ఇంట్లో కూడా కుటుంబ సభ్యుల మధ్య భౌతిక దూరం పాటించడం ఉత్తమమని తెలియజేయడం జరుగుతుంది. ఇరుగు పొరుగు వారితో కూడా

మాట్లాడరాదని, వీధుల్లో సరఫరా చేసే కూరగాయలు, తాగు నీరు వంటి వాటి ద్వారా అవసరాలను తీర్చుకోవాలని సూచించడం జరుగుతుంది. పాతపట్నం ప్రాంతంలో ఆవాసాల వారీగా

ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణ చేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam