DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐసోలేషన్ వార్డులను పరిశీలించిన కలెక్టర్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 30, 2020 (డిఎన్ఎస్) : శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కోవిడ్ 19 (కరోనా)కు ప్రత్యేకంగా

ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ జె నివాస్ గుర వారం పరిశీలించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కోవిడ్ వ్యాధిగ్రస్తులు వస్తే వారిని

ప్రత్యేకంగా వార్డులలో పెట్టడమే కాకుండా వారిని ఆసుపత్రికి తీసుకువచ్చే మార్గాలను సైతం ప్రత్యేకంగా ఉండాలని అన్నారు. కరోనా వ్యాధిగ్రస్తులు వచ్చే రహదారి

గుండా ఇతర వ్యాధిగ్రస్తుల రాకపోకలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. జిజిహెచ్ లో 90 బెడ్లను ఐసోలేషన్ క్రింద ప్రత్యేకించి ఏర్పాటు చేసిన సంగతి

విదితమే. à°ˆ వార్డులలో పనిచేసే వైద్యులకు, సిబ్బందికి కూడా ప్రత్యేక వసతి ఉండాలని, పర్సనల్ ప్రొటేక్షన్ ఎక్విప్మెంటు సరఫరా చేయాలని సూచించారు. 

ఆరోగ్య సేతు

యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి

ప్రజలు అందరూ ఆరోగ్య సేతు యాప్ ను  à°¡à±Œà°¨à± లోడ్ చేసుకోవాలని కలెక్టర్ నివాస్ సూచించారు. ఆరోగ్య సేతు యాప్ వలన వివరాలు తెలుసుకొనుటకు

ఉపయోగపడుతుందని చెప్పారు. దగ్గరలోకి కరోనా రోగి వచ్చినా అప్రమత్తం చేస్తుందని తెలిపారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రాష్ట్ర టెలీ మెడిసిన్ హెల్ప్ లైన్ 14410 ఫోన్

నంబరుకు పోన్ చేయవచ్చని, అదేవిధంగా జిల్లాలో ఏర్పాటు చేసిన 9490576658 నంబరుకు కూడా ఫోన్ చేయవచ్చని తెలిపారు. కరోనా సమాచారానికి 104 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. 
/>     à°ˆ కార్యక్రమంలో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు అధికారి సి.యం. సాయికాంత్ వర్మ, డిప్యూటి కలెక్టర్ ఆర్.గణపతి, జిజిహెచ్ సూపరింటిండెంట్

డా.ఏ.కృష్ణమూర్తి, ఆర్.ఎం.ఓ డా.ఆర్.అరవింద్, ఏపిఎంఐడిసి డిప్యూటి కార్యనిర్వాహక ఇంజనీరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam