DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్‌డౌన్‌ మీడియా పాసులపై నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆరా

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 30, 2020 (డిఎన్ఎస్) : కరోనా నియంత్రణ చర్యలను గురించి ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం

చేస్తున్న మీడియా పాత్ర మరువలేనిదని కానీ నెల్లూరు నగరంలో 500 మంది జర్నలిస్టులు లాక్ డౌన్ లో పాసులు తీసుకున్నారా అని జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు సమాచార , పౌర

సంబంధాల శాఖ అధికారులను వాకబు చేసినట్లు సమాచారం. లాక్ డౌన్ లో నిజంగా పనిచేసే వారికే పాసులు ఉండాలని ఆయన సూచించారు. ఊరికినే పాస్ లు పెట్టుకొని నెల్లూరు నగరంలో

తిరిగే పద్ధతికి స్వస్తి పలకాలన్నారు. ఎక్కువమంది తిరగడం వల్ల కరోనా  à°¨à°¿à°¯à°‚త్రణ చర్యలకు ఆటంకం కలుగుతుంది అన్నారు. పనిచేసే జర్నలిస్టులు ఎంతమంది ఉన్నా పాసులు

ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని కానీ ఇవి దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించారు. వీటిని 150 వరకు పరిమితం చేస్తే ఎలా ఉంటుందని కలెక్టర్ సూచించగా.. అక్రిడేషన్

లిస్టు ప్రకారమే పాసులు జారీ చేశామని డిపిఆర్ఓ అధికారులు పేర్కొన్నారు. దీంతో అక్కడితో సంభాషణ నిలిచిపోయింది.. లాక్ డౌన్ పాసులు దుర్వినియోగం కాకుండా ఎవరికి

వారు స్వీయ నియంత్రణ పాటించాలి...

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam