DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సదా ఆర్తుల సేవలో భగవాన్ సత్యసాయి సేవ సంస్థలు :

*కరోనా పై పోరుబాటలో తాము సైతం ముందుకు* 

*లక్ష మాస్క్ à°² తయారీ మొదలైంది విశాఖ శాఖా నుంచే. . .* 

*లక్షలాదిగా మాస్క్ à°² తయారీ,  à°†à°¹à°¾à°°à°‚ . పంపిణీ..* 

*ఆర్తుల

సేవే పరమార్థంగా దేశవ్యాప్తంగా సేవ సాగుతోంది* 

*ఏపీ మీడియా సమన్వయకర్త ద్వారం స్వామి వెల్లడి* 

*సత్యసాయి సేవ సంస్థల పై DNS ప్రత్యేక కధనం*

*(DNS రిపోర్ట్

: సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 30, 2020 (డిఎన్ఎస్) : ప్రపంచాన్ని వొణికిస్తున్న కరోనా మహమ్మారి రాక్షసుని పై పోరుకు తాము సైతం ముందుకు అంటూ శ్రీ

సత్య సాయి సేవా సంస్థలు అడుగు ముందుకు వేసినట్టు ఆంధ్ర ప్రదేశ్ మీడియా సమన్వయకర్త ద్వారం స్వామి వెల్లడించారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా చేపట్టిన కార్యాచరణను ఆయన DNS

కు వివరించారు. గత కొన్ని రోజులుగా అన్నార్తులకు ఆహారాన్ని అందించడంతో పాటు, ఎందరికో నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నాయి. అదే విధంగా రాక్షసుని నుంచి

రక్షించబడడానికి ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ లు ధరించవలసిన అవసరం ఉంది. దీనికై లక్షలాదిగా మాస్క్ లను భారత దేశం లోని అన్ని శాఖలూ స్వయంగా తయారు చేసి ఆయా

రాష్ట్రాల్లో విస్తృతంగా పంపిణీ చేస్తున్నాయి. దీనిలో భాగంగానే . . .ఆంధ్ర ప్రదేశ్ శాఖా, ప్రధానంగా విశాఖపట్నం కేంద్రం నుంచి సత్యసాయి సేవా సంస్థలు చేపడుతున్న

కార్యాచరణ దేశ వ్యాప్తంగా మార్గదర్శకంగా నిలిచింది. 

మాస్క్ à°² తయారీ మొదలైంది విశాఖ శాఖా నుంచే. . . 

భారత దేశంలో కేరళ రాష్ట్రంలో కరోనా రాక్షసుడు

విజృంభిస్తున్న మొదట్లో విశాఖపట్నం సత్యసాయి సేవా సంస్థల మహిళా విభాగం సభ్యులు మంచి ఉన్నతమైన ఆలోచనతో ముందుకు వచ్చారు. లక్షకు పైగా మాస్క్ లను స్వయంగా తయారు

చేసి పంపించేందుకు రంగం లోకి వచ్చారు. ఒక్కొక్కరుగా తోడవుతూ ఆశించిన సంఖ్యా కంటే అధికంగానే మాస్క్ ల తయారీ కావడంతో విశాఖపట్నం లోని ప్రత్యక్ష పోరాట యోధులకు

కూడా పంపిణీ చేశారు. ఇదే స్ఫూర్తిగా కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా సహా అన్ని రాష్ట్రాల్లోని శాఖాలు ఈ మాస్క్ ల తయారీని ఒక సేవ ఛాలెంజ్ గా తీసుకుని విస్తృతంగా

తయారీ చేస్తున్నారు. 

ఆర్తులకు అండగా. . ఆహార పంపిణీ. . . కార్యాచరణ. . .

‘‘ పేదవారికి ’రోజూ 28,000 నుండి 33,000 భోజనం ఆహార పంపిణీ కై   కమ్యూనిటీ వంటశాలలను

ఏర్పాటు 

• ఇప్పటివరకు, 86,000 కుటుంబాలకు 10,99,000  à°¬à°¿à°¯à±à°¯à°‚, పప్పులు, ఇతర నిత్యావసర సరుకుల  à°ªà°‚పిణీ

* ఆరోగ్యం, పారిశుధ్య కార్మికులు మరియు నిరుపేదలకు 2 లక్షల భద్రతా

ముసుగుల(మాస్కులు) విరాళంగా ఇచ్చారు

*త్వరలో ప్రతిరోజూ 1,00,000 భోజనం వడ్డించడానికి కమ్యూనిటీ కిచెన్ సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రణాళికలు

, త్వరలో 50,00,000

కిలోగ్రాముల చిరు ధాన్యాల( బియ్యం, పప్పులు,) పంపిణీతో సుమారు 4,00,000 మంది పేద కుటుంబాలకు చేయూత ఇవ్వడం కోసం బృహత్ ప్రణాళిక తో ముందుకు వస్తున్నారు. 


ఆర్తుల

సేవతోనే ఆరాధనోత్సవాలు . . .

సత్య సాయి బాబా ఆరాధనోత్సవాన్ని ఆర్తులకు à°…à°‚à°¡à°—à°¾ నిలవడం ద్వారా  à°­à°•à±à°¤à±à°²à± ఆనందంగా జరుపుకున్నారు. సత్య సాయి సేవా సంస్థలు దేశ

వ్యాప్తంగా 86  à°¶à±à°°à±€ సత్య సాయి కమ్యూనిటీ కిటీచేన్స్ ను ప్రారంభించి ప్రతి రోజూ à°ˆ లాక్ డౌన్ ప్రారంభించినప్పటినుంచి కనీసం దేశ వ్యాప్తంగా 28 ,000 నుండి 33000 మందికి వండిన

ఆహారపు పదార్ధాలను  à°…à°‚à°¦ చేస్తున్నారు.

ప్రభుత్వ నియమాలు, సూచనలమేరకు శుభ్రమైన, శుచిగా, రుచికరమైన ఫలహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాల్ని శ్రీ సత్య సాయి సేవా

సంస్థలు దేశం నలుమూలలా అవసరమైన వారికి à°ˆ కమ్యూనిటీ కిచెన్ ద్వారా  à°…ందిస్తున్నారు. à°ˆ ప్రత్యేక కార్యక్రమం ద్వారా దేశం మొత్తం మీద ఇప్పటిదాకా 5,68, 000  à°®à°‚దికి

ఆహారాన్ని అందించారు.

ఇవే కాకుండా దేశం మొత్తం మీద ఇప్పటిదాకా నెలసరి ఆహార పదార్ధాలు, బియ్యం, కంది పప్పు, పంచదార, వంట నూనె, చింతపండు వంటి మొత్తం 11  à°…త్యవసర

సామాన్లతో ఉండే " అమృత కలశం" అన్న సెట్లను ఇప్పటిదాకా 86000 నిరుపేద  à°•à±à°Ÿà±à°‚బాలకు 1099000  à°•à±‡à°œà±€à°² బియ్యం, ధాన్యాలు, గోధుమ పిండి, పప్పుధాన్యాలు, ఉప్పు, చక్కెర మొదలైనవి.ఇతర

ఆహరం తయారు చేసుకునేందుకు దోహద పడే సామాగ్రిని à°…à°‚à°¦ చేశారు. à°ˆ అమృత కళాశాలు కనీసం నలుగురు ఉండే కుటుంబానికి పది రోజులకు పైగా సరిపడతాయి. à°ˆ ప్రయత్నం ద్వారా 86,000

కుటుంబాలకు 10,99,000 లక్షల కిలోల తృణధాన్యాలు పంపిణీ చేయబడ్డాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam