DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గుజరాత్ నుంచి మత్స్యకారులు రాజమండ్రికి రాక 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 01, 2020 (డిఎన్ఎస్) : లాక్ డౌన్ సందర్భంలో గుజరాత్ లో చిక్కుకున్న వలస మత్యకారులను ప్రభుత్వం వారి

వారి ప్రాంతాలకు తరలిస్తుందని వీరికి ఈ రోజు అనగా శుక్రవారం మధ్యాహ్నం వెలుగుబంద నన్నయ్య యూనివర్సిటీలో జిల్లా యంత్రాంగం భోజన సదుపాయాలు ఏర్పాటు చెయ్యడం

జరిగిందని మత్య శాఖ జాయింట్ డైరెక్టర్ పీ జయ రావ్ తెలిపారు.

విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలవారు, ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలవారు మరియు తూర్పు

గోదావరి జిల్లా మత్య కారులను వారి వారి ప్రాంతాలకు 54 బస్సులు ద్వారా 4 వేల మందిని తరలించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెర్యలు చేపట్టగా ఈ రోజు

మధ్యాహ్నమునకు 12 బస్సులు ద్వారా 836 మంది రాజమహేంద్రవరంనకు చేరుకోగా వీరికి జిల్లా యంత్రాంగం భోజన సదుపాయాలు ఏర్పాటు చెయ్యడం జరిగిందని, ఈ రోజు రాత్రికి మరో 5

బస్సులు రాజమహేంద్రవరం చేరుకుంటాయి అన్నారు సిబ్బందిని అందుబాటులో ఉంచాం అన్నారు. తూర్పు గోదావరికి చెందిన 9 మందిని బొమ్మూరు క్వారంటైన్ సెంటర్ కు తరలించడం

జరిగిందని  à°œà°¯ రావ్ తెలిపారు. మత్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జి వెంకటేశ్వర రావు పరివేక్షించారు.

గుజరాత్ నుండి వచ్చి రాజమహేంద్రవరం చేరుకున్న

మత్యకారులతో నన్నయ్య యూనివర్సిటీలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ కొద్దీ సేపు మాట్లాడి వారికి మాస్క్లను అందజేయసారు, ప్రభుత్వం

భరోసాగా ఉంటుందని కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలను పాటించాలని సూచించారు. తమనితాము రక్షించుకొని వారి కుటుంబాలని రక్షించుకోవాలని

అన్నారు.

మీడియాతో మాట్లాడుతూ వీరందరిని వారి వారి ప్రాంతాలలలో క్వారంటైన్ సెంటర్లో ఉంచి కోవిద్ లక్షణాలు ఉన్నట్లయితే ప్రభుత్వం మంచి వైద్య సదుపాయాలను

అందచెయ్యబడును అన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam