DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిన్న తిరుమల, నేడు తిరుచానూరు .  రాత్రికే రాత్రే అర్చకులను బయటకి విసిరేస్తారా ?

వివాదాల మాయం à°—à°¾ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు  à°¨à°¿à°°à±à°£à°¯à°¾à°²à±...

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు à°•à°¿ అర్చకులంటే  à°…à°‚à°¤ అలుసా, 

విశాఖపట్నం, జులై 4 , 2018 (DNS Online ): తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు కి

అర్చకులంటే చాలా అలుసుగా ఉన్నట్టు తెలుస్తోంది. రాత్రికి రాత్రే అర్చకులను ఉద్యోగం నుంచి బలవంతంగా తొలిగించి ఆలయం నుంచి బయటకు నెట్టేస్తున్నారు. ఈ విధమైన

దౌర్భాగ్యం గతం లో లేదు. తిరుమల ఆలయం లో ఒక ప్రత్యేక విధానం లో నడుపబడుతుంది. స్వామి ఆవిర్భావం నుంచి అయన సూచించిన మేరకు మిరాశీ విధానం లో అర్చకులు

వంశపారంపర్యంగా ఆయన్ను అర్చించడం జరుగుతోంది. అది స్వామి ఆదేశం. ఆలయాలు నిలబడేందుకు మూలస్థంబాలు అర్చకులే. ఆలయాల్లో అర్చకులు తమ విధులు సవ్యంగా నిర్వహిస్తేనే

భక్తులు ఆలయాలకు రావడం జరుగుతుంది. తద్వారా ఆలయానికి ఆదాయం వస్తుంది. అలాంటిది... తిరుమల దర్శనానికి వచ్చే కోట్లాది మంది భక్తులు స్వామిని ఆరాధించే విధానం బట్టే

మళ్ళీ మళ్ళీ ఆలయానికి వస్తుంటారు. అది కేవలం అర్చకుల వల్లే సాధ్యం. అంతే గానీ ఏదో టిటిడి బోర్డు ఫలానా వాడు చైర్మన్ గా ఉన్నాడు కదా అని, ఫలానా వాడు బోర్డు సభ్యుడుగా

ఉన్నాడు అని తిరుమల దర్శనానికి భక్తులు రారు. గతం లో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం ఉన్న టిటిడి పాలకమండలి చాలా వివాదాస్పద నిర్ణయాలను అమలు చేస్తోంది. అర్చకుల విధానం

తో ఏమాత్రం సంబంధం లేకుండా పనిచేయవలసి బోర్డు, ప్రస్తుతం కేవలం తమ పనంతా ప్రక్కన బెట్టి, కేవలం అర్చకులను రాత్రికి రాత్రే బయటకు విసిరేసే పనిలో పడింది.  à°‡à°Ÿà±€à°µà°²à±‡

తిరుమల ప్రధాన ఆలయంలో వంశపారంపర్యంగా వస్తున్నా అర్చకులను ( ప్రధాన అర్చకుని తో సహా) అందరినీ రాత్రి కి రాత్రే బయటకు విసిరేసింది. అది వివాదం గా కొనసాగుతుండగానే

నిన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అర్చకులను సైతం రాత్రికి రాత్రే బయటకు విసిరేసింది. ( వీళ్ళ ఇళ్లకు నోటీసులు అంటించి ఘోరంగా

అవమానించింది). 

అసలు అర్చకులను విరమణ అంతే  à°µà°¿à°¸à°¿à°°à±†à°¯à±à°¯à°¡à°®à±‡à°¨à°¾ ?

ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ అంటే ఘనంగా సమ్మానం చేసి, సగౌరవంగా ఇంటికి పంపడం జరుగుతుంది.

ఇదేమి దౌర్భాగ్యమో గానీ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో à°ˆ సంప్రదాయం లేనట్టుగా ఉంది, అది కూడా అర్చకులకు మాత్రమే ఇలాగ చేస్తుంటారు....  à°…ర్చకులతో సమావేశం నిర్వహించి, సగౌరవంగా పదవి

విరమణ చేయించవచ్చు. కానీ టిటిడి పాలక మండలి అర్చకుల పట్ల సదభిప్రాయం లేకపోవడం తో వీళ్ళ విధానం లో ఏనాడూ ఒక పద్దతి పాటించేందుకు సిద్ధంగా లేదు. రహస్యంగా, గౌరవంగా

చెయ్యవలసిన పని ని ఈ పాలక మండలి రచ్చకీడ్చి, రోడ్డెక్కి కూర్చుంది. దీనిపై హైందవ సమాజం తప్పు పడుతున్న తామకేమీ పట్టనట్టు ఉంది. ఆలయ వ్యవస్థను మంటకలిపేందుకే ఈ

బోర్డు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోందని భక్తులు మండిపడుతున్నారు.  
అసలు ఈ బోర్డు నియామకమే పెద్ద వివాదం గా ఉంది, ఒక క్రైస్తవ అభిమాని ని టిటిడి బోర్డు

చైర్మన్ గా నియమించడాన్ని దాదాపుగా అందరూ తప్పుపట్టారు. పైగా ఎన్నో వివాదాల్లో మునిగిన వ్యక్తులను బోర్డు సభ్యులుగా నియమించడం మరింత వివాదం అయ్యినా, నాకేమి

పట్టింది అన్న ధోరణిలో ప్రభుత్వం à°ˆ బోర్డు నియామకం చేసేసింది. తొలిరోజు నుంచే à°ˆ బోర్డు వివాదమయమైన నిర్ణయాలు తీసుకుంటోంది. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam