DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమలాపురంలో సడలింపు లతో కూడిన లాక్డౌన్ : ఆర్.డి. ఓ

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 03, 2020 (డిఎన్ఎస్) : కరోనా విపత్తు కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని  à°•à±‹à°¨à°¸à±€à°® పట్టణం  à°…మలాపురం

డివిజన్ లో మే 17 వ తేదీ వరకు సడలింపు లతో కూడిన లాక్ డౌన్ అమలు చేయడం జరుగుతుందని అమలాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ ఆదివారం ఒక ప్రకటనలో

తెలియచేసారు. ప్రస్తుతం అమలాపురం డివిజన్ ఆరంజ్ జోన్ వుందని, మరో 21 రోజులపాటు జిల్లా లో ఎటువంటి పాజిటివ్ కేసులు నమోదు కాకపోతే అమలాపురం డివిజన్ ను గ్రీన్ జోన్ గా

ప్రకటించడం జరుగుతుందని ఆర్.డి. ఓ తెలియచేశారు. రేపటి నుండి ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకు నిత్యావసర సరుకులు విక్రయించే షాపులకు అనుమతి ఇవ్వడం జరిగిందని,

పెద్దపెద్ద దుకాణాలు, షాపింగ్ మాల్స్ కు, సినిమా థియేటర్లు కు విద్యా సంస్థలు కు, జమ్స్ అండ్ జ్యూ లరీ షాపులకు, బిగ్ బజారు లకు, మరియు పెద్ద పెద్ద షో రూమ్ లకు అనుమతి

లేదని ఆర్.డి. ఓ తెలిపారు. మిగిలిన దుకాణాలు అన్నీ ఉదయం 7.00 గంటల నుండి, సాయంత్రం 7.00 వరకు తెరుచు కునేందుకు అనుమతి ఇవ్వడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. ప్రజలు సమూహాలుగా

తిరిగే అవకాశం వున్న వివాహ కార్యక్రమాలు, దైవ సంబంధ కార్యాలు వంటి వాటికి సడలింపులు తో కూడిన అనుమతి ఇవ్వడం  à°œà°°à°¿à°—ిందని ఆయన తెలిపారు. వివాహానికి పది మంది సభ్యులు

వరకు అనుమతి ఇవ్వడం జరిగిందని, శవ యాత్ర కు పది మంది వరకు అనుమతి వుందని, అలాగే దైవ కార్యాలకు ఇద్దరు పూజారులతో పాటు ఐదు మందికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని, ఆర్.డి. ఓ

తెలిపారు. సాయంత్రం 7.00 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 7.00 గంటల వరకు సంపూర్ణ లాక్ డౌన్ అమలు లో ఉంటుందని, ఈ సమయం లో ఎవరైనా బయటకు వస్తె చర్యల చాలా తీవ్రం గా వుంటాయని ఆర్.డి.

ఓ పేర్కొన్నారు. బ్యాంకులు అన్నీ సామాజిక దూరం పాటిస్తూ వారి వారి రెగ్యులర్ టైమ్ లో యధావిధిగా పని చేసుకోవచ్చునని ఆర్.డి. ఓ తెలిపారు. ప్రైవేటు సంస్థలు 33 శాతం

పనివారితో పని చేయించు కోవచ్చు నని ఆయన తెలియ చేశారు. సెలూన్ షాపులు కు అనుమతి ఇవ్వడం జరిగిందని, మాంసం దుకాణ దారులు తప్పనిసరిగా మాస్క్ లు, గ్లోవ్స్ లు ధరించి

విక్ర ఇంచు కోవచ్చునని, ప్రజలు సామాజిక దూరం పాటించాలని లేనియెడల  à°¦à±à°•à°¾à°¨ దారునిపై క్రిమినల్ కేసులు బనాయించ à°¡à°‚   జరుగుతుందినీ ఆర్.à°¡à°¿. à°“ హెచ్చరించారు.హోటల్స్,

రెస్టారెంట్లు, పెద్ద పెద్దబట్టల  à°¦à±à°•à°¾à°£à°¾à°²à± తెరవడానికి లేదని  à°†à°¯à°¨ తెలిపారు. రహదారి నిర్మాణ పనులు రోజంతా చేసుకోవచ్చునని ఆర్.à°¡à°¿. à°“ తెలిపారు. స్వర్ణ కారులు

(బంగారం పని వారు) వారివారి పనులు చేసుకోవచ్చునని,పెట్రోలియం,వ్యవసాయ, కిరాణా వర్తకం,మిల్లర్లు, వారి పని వారు చేసుకోవచ్చునని ఆర్.డి. ఓ తెలిపారు. బుక్స్, అండ్

స్టేషనరీ, ఫాన్సీ షాపులకు అనుమతి ఇవ్వడం జరిగిందని, మెడికల్ షాపులకు అయితే 24 గంటలు అనుమతి ఇవ్వడం జరిగిందని ఆర్.డి. ఓ పేర్కొన్నారు. ఆసుపత్రులలో ఓ.పి చూడవచ్చని,

మిల్క్, డైరీ ఉత్పత్తులను అనుమతి వుందని ఆయన తెలిపారు. సినీమా థియేటర్లు పూర్తిగా బంద్ చేయాలని. ఆర్.డి. ఓ తెలిపారు. ఈ_కామర్స్ కు అనుమతి వుందని, ఆటోల కు, రిక్షా లకు

అనుమతి లేదని, లారీ లలో మితిమీరిన ప్రజలను తీసుకు వెళితే క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుందని ఆర్.డి. ఓ హెచ్చరించారు. మోటార్ సైకిల్ పై ఇద్దరికి అనుమతి

వుందని,ఆర్.డి. ఓ. తెలిపారు. వ్యవసాయ సంబంధిత పనులు, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పనులు, మరియు ఇంజనీరింగ్ పనులకు అనుమతి ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. సభలు, సమావేశాలు,చర్చ్, మసీదు,

హిందూ ప్రార్థనలకు అనుమతి లేదని, లాక్ డౌన్ ముగిసే వరకు మద్యం విక్రయం పూర్తిగా నిషేధించడం జరిగిందనీ ఆర్.డి. ఓ తెలిపారు. ఇన్ని రోజులు లాక్ డౌన్ అమలుకు

ప్రభుత్వానికి సహకరించి నందుకు ప్రజలకు ఆర్.డి. ఓ కృతజ్ఞతలు తెలియ చేస్తూ మే 17 వరకు వున్న సడ లింపులతో కూడిన లాక్ డౌన్ ను ప్రజలు అందరూ బాధ్యతగా బావించి

క్రమశిక్షణతో మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ లాక్ డౌన్ ను విజయవంతంగా అమలు చేయాలని ఆర్.డి. ఓ. కోరారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam