DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మా రాష్ట్రాలకు పంపండి బాబోయ్, ఈతకోట వలస కార్మికులు 

*రావులపాలెం ఈతకోట ఎరువుల పరిశ్రమ కార్మికులు ఆవేదన* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 04, 2020 (డిఎన్ఎస్) : లాక్ డౌన్ నేపధ్యంలో

వలస కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట సమీపంలోని à°’à°• ఎరువులు తయారీ పరిశ్రమ లో  à°ªà°¨à°¿à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨ కార్మికులు

లాక్ డౌన్ మొదలుకొని ఇబ్బందులు పడుతున్నారు. à°ˆ కరోనా వైరస్  à°²à°¾à°•à± డౌన్ నేపధ్యంలో à°—à°¤ కొన్ని రోజులుగా కంపెనీ మూతపడింది.అప్పటి నుండి ఒరిసా రాష్ట్రానికి చెందిన 22

మంది బీహార్ రాష్ట్రానికి చెందిన 6 గురు మొత్తం 28 మంది కార్మికులు కాలిగా ఉంటున్నారు. వీరికి ఏ పనులు లేక పోవడంతో కంపెనీ ఒక రూమ్ ను కేటాయించి అందులో ఉండమని

చెప్పింది. అప్పటి నుండి ఆ రూమ్ లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ కు పలు సడలింపులు ఇచ్చింది. దీంతో వారు తమ గ్రామాలకు పంపించాలని

కంపెనీ యాజమాన్యం ను  à°•à±‹à°°à°¾à°°à±. అయినా వారు పట్టించుకోక పోవడంతో కార్మికులు అందరూ కలిసి కాలి నడకన  à°•à±Šà°¤à±à°¤à°ªà±‡à°Ÿ తహశీల్ధార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం

తహశీల్ధార్ గారిని కలవగా మీ పరిశ్రమ రావులపాలెం పరిధిలోకి వస్తుంది రావులపాలెం తహశీల్ధార్ గారిని కలిసి మీ సమస్యను తెలియజేయమని చెప్పినట్టు వారు వారు

చెబుతున్నారు. అయితే మాకు à°ˆ ఆఫీసులు  à°Žà°•à±à°•à°¡ ఉన్నాయో తెలియవు మమ్మల్ని మా రాష్ట్రాలకు పంపించాలని మీడియా ద్వారా అధికారులను వేడుకుంటున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam