DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తాగుబోతులకి బంపర్ అఫర్ :నిన్న ఎక్కించిన కిక్కు దింపేశారు

*ఆంధ్రా లో తాగుబోతులకి ప్రభుత్వం గట్టి షాక్* 

*మద్యం ధరలు 75% పెంపు. నేటి నుంచే అమలు లోకి.* 

*నిన్న 25 % పెంచారు. ఇవాళ మరో 50 % రేటు పెంచేశారు*.

*రద్దీ

తగ్గించేందుకే ధరల పెంపు : అధికారుల వెల్లడి.*

*అయినా తగ్గని మందుబాబుల జోరు. .అదే క్యూలు. . .*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). .

.*

అమరావతి, మే 05, 2020 (డిఎన్ఎస్) : ఆంధ్ర ప్రదేశ్ లో తాగుబోతులకి ప్రభుత్వం మంగళవారం గట్టి షాక్ ఇచ్చింది. మొదటి రోజు ఎక్కించిన కిక్కు మంగళవారం దింపేసింది. నిన్న 25

శాతం అధికంగా ధరలు పెంచి అమ్మిన మద్యం విక్రయాలను మంగళవారం నుంచి మరో 50 శాతం పెంచి ( మొత్తం 75 శాతం ) అధికంగా పెంచేసింది. అయినా తగ్గని మందుబాబుల జోరు. .అదే క్యూలు

బారులు తీరి దుకాణాల ముందు దేవురిస్తున్నారు.  . .

ఈ పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమలు కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి షాపులు తెరుచుకోనున్నాయి. కాగా ఈ

నెలాఖరులోగా 15 శాతం మద్యం దుకాణాలను మూసేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

మంగళవారం ఉదయం మద్యం షాపులు తెరుచుకోలేదు.  à°®à°¦à±à°¯à°‚ అమ్మకాలను ప్రభుత్వం

తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు  à°ˆ మేరకు ఎక్సైజ్ శాఖ ఉదయమే à°“ ప్రకటన విడుదల చేసింది. అమ్మకాలు మళ్లీ ఎప్పట్నుంచి ప్రారంభించాలనే దానిపై తదుపరి ఉత్తర్వులు

వచ్చే వరకు నిలిపివేయాలని కమిషనర్‌ తెలిపారు. మద్యం షాపుల వద్ద రద్దీని తగ్గించడం, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంపై దృష్టిపెట్టాలని ఏపీ ప్రభుత్వ

నిర్ణయం నిర్ణయించింది. రద్దీని తగ్గించేందుకు టోకెన్‌ పద్ధతిని అమలు చేసే అంశంపై పరిశీలించారు. 

వీటితో పాటు ఇతర రాష్ట్రాల్లో 50 నుంచి 70 శాతం వరకు మద్యం

ధరలు పెంచారని పలువరు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలను పరిశీలించి ఫైనల్‌à°—à°¾ మార్గదర్శకాలను ఉదయం 11 గంటలకు జారీ చేసింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam