DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెళ్ళి విందుకి పదుల సంఖ్యల్లోనా మందుకు గుంపులు గుంపులా?

*మద్యం విక్రయాలపై సర్వత్రా నిరసనలు పెల్లుబికుతున్నాయి. .*

*లాక్ డౌన్ రూల్స్ పెళ్ళివాళ్ళకేనా? మద్యం విక్రయాలకు లేవా?*

*ప్రజలు పాటిస్తున్నారు - పాలకులే

గాడితప్పుతున్నారు.  .*

*బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ సత్యనారాయణ మండిపాటు* 

*పాలక పక్షం నుంచే ఘాటైన విమర్శలు. . . *

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్ ,

రిపోర్టర్ , విశాఖపట్నం ). . .*

విశాఖపట్నం, మే 06, 2020 (డిఎన్ఎస్) : ప్రస్తుతం లాక్ డౌన్ 3 కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనం అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.

అయితే ప్రజా ఆరోగ్యం కంటే ఖజానా నింపడమే ముఖ్యం అనుకున్న ప్రభుత్వం ఒక్క సారిగా మద్యం దుకాణాలు తెరిచేసిందని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ కెవివివి

సత్యనారాయణ మండిపడ్డారు. 
దీంతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు మొదలయ్యాయన్నారు. ఇంతకాలం ఫోల్ట్రీ ఉన్న కోళ్లలా ఇళ్లకే పరిమితం అయినా జనం ఒక్క సారిగా మద్యం

దుకాణాలు తెరవడం తో పాటు రాత్రి వరకూ రమ్మని పిలవడం తో పౌల్ట్రీ నుంచి బయటకు వదిలిన కోళ్లలా వేలాదిగా జనం బయటకు వచ్చి గుంపులు గుంపులుగా వైన్ షాపులకు

వెళ్తున్నారన్నారు. దీంతో కట్టడి చెయ్యడంలో పోలీసులు చేతులెత్తేయడం తో వీళ్ళని అదుపు చెయ్యడానికి  à°¸à°°à°¸à±à°µà°¤à°¿ నిలయాల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను మందు

దుకాణాల దగ్గరా కాపలా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.   

పెళ్ళి à°•à°¿ పదుల సంఖ్యల్లోనా, ముందుకి గుంపుల్లోనా? : .  . . 

పెళ్లిళ్లు సీజన్ కూడా కావడం తో  à°²à°¾à°•à±

డౌన్ అమలు లో ఉండడంతో కేవలం పదుల సంఖ్యల్లో మాత్రమే అనుమతి ఇచ్చారు. అంతకు మించి జనం పాల్గొంటే. . పోలీస్ కేసులు పెట్టి కఠిన చర్యలు పెడతామంటూ సాక్షాత్తు డిజిపి

స్థాయి అధికారులే హెచ్చరించారన్నారు. వీళ్ళ బెదిరింపులకు హడిలిపోయిన ప్రజలు తమ శుభకార్యాలు వాయిదా వేసుకున్నారని  à°¦à±€à°‚తో వేల సంఖ్యలో జరగవలసిన పెళ్లిళ్లు ,

కేవలం పదుల సంఖ్యలోనే జరుగుతున్నాయన్నారు. అదే విధంగా అశుభ కార్యాలకు కేవలం 20 మందికే అనుమతి ఇచ్చారు. దీనికీ ప్రజలు తలొగ్గారని ,  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం తీసుకున్న à°ˆ

నిర్ణయం కారణంగా కేంద్రం à°—à°¤ 40 రోజులుగా పెట్టిన లాక్ డౌన్ ఉద్యమం పూర్తిగా నీరుగారిపోయిందన్నారు. 

లాక్ డౌన్ రూల్స్ పెళ్ళివాళ్ళకేనా? తాగుబోతులకి

లేవా?

à°ˆ సమయంలోనే పాలకులు మద్యం దుకాణాలను తెరిచి మొత్తం లాక్  à°¡à±Œà°¨à± నిబంధనల క్రమశిక్షణ ను పూర్తిగా తుంగలోకి తొక్కేశారు. à°ˆ దుకాణాల దగ్గర బారులు తీరిన

క్యూలైన్ లు చూస్తే గుంపులు గుంపులుగా వెళ్లడం తో  à°²à°¾à°•à± డౌన్ నిబంధనలను పూర్తిగా తుంగలోకి తొక్కేశారని అధికార పార్టీ అభిమానులే ఆక్రోశిస్తున్నారు.

పెళ్ళిళ్ళకి కేవలం పదుల సంఖ్యల్లోనే అనుమతిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసిన పాలకులు మందు దుకాణాల వద్ద గుంపుల్లా అనుమతించడాన్ని

ప్రశ్నిస్తున్నారు. 

లాక్ డౌన్ రూల్స్ , నిబంధనలు కేవలం  à°ªà±†à°³à±à°³à°¿à°µà°¾à°³à±à°³à°•à±‡à°¨à°¾?   తాగుబోతులకి వర్తించవా అని ప్రశ్నించే ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ఏమి జవాబు

చెప్తుందన్నారు.  

పాలక పక్షం నుంచే ఘాటైన విమర్శలు. . . 

ప్రతిపక్షం చేసే విమర్శల కన్నా అధికార పార్టీ క్యాడర్ , అభిమానులు చేసే విమర్శలు మరింత ఘాటుగానే

వినిపిస్తున్నాయి. గత దశాబ్దకాలంగా పార్టీ అభివృద్ధి కోసం తాము పడిన కష్టాన్ని ఒక్క మద్యం దుకాణాల అనుమతి ఆదేశం ద్వారా పూర్తిగా తుడిచి పెట్టేశారని అభిమాన

వర్గాలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా విమర్శించడం గమనార్హం. 

గత ప్రభుత్వం తో విసిగి పోయిన రాష్ట్ర

ప్రజలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కి ఒక్క అవకాశం ఇవ్వాలని ఎంతో అభిమానంతో దాదాపుగా పూర్తి సీట్లు ( 151 ఎం ఎల్ ఏ ) ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టేరు. అయితే లాక్ డౌన్

సమయంలో మద్యం దుకాణాలను తెరిచి అమ్మకాలు మొదలు పెట్టడం తో ఇంతగా అభిమానించిన ప్రజలు పూర్తిగా విమర్శించడం తో పాటు మద్యం విక్రయాల్లో సరస్వతి పుత్రులైన

ఉపాధ్యాయులను విధుల్లో నియమించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాన గ్రాఫ్ ఆకాశం నుంచి పాతాళానికి పడిపోతోందని  à°…భిమాన వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam