DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సరిహద్దుల్లో కార్మికుల కాలిబాట ప్రయాణాల కొనసాగింపు.  

*సంస్థ జీతాలు లేవు - ప్రభుత్వ పట్టింపు లేదు. .*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 06, 2020 (డిఎన్ఎస్) : కరోనా కట్టడి లో వెసులుబాటు తో

రాష్ట్ర సరిహద్దుల్లో కార్మికుల కాలిబాట ప్రయాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. పని చేస్తున్న సంస్థ జీతాలు à°‡à°µà±à°µà°²à±‡à°¦à± తాము పడుతున్న కష్టాలపై  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°¾à°¨à°¿à°•à°¿ పట్టింపు

లేదని వలస కార్మికులు ఆవేదన చెందుతున్నారు. జగ్గయ్యపేట ప్రాంతంలో గల వివిధ కర్మాగారాల నుండి మరియు నేషనల్ హైవే నె:65 పై తెలంగాణా, మహారాష్ట్ర, హర్యానా, ప్రాంతం

నుండి వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్ళటానికి కాలి నడకన ప్రయాణం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయాల మేరకు ఆయా రాష్ట్రాల అనుమతులతో వారి

స్వస్థలాకు వెళ్ళే పరిస్థితులను ప్రభుత్వాలు కలిపిస్తూ వారి కొరకు కరోనా రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసి వారి స్వ స్థలాలకు పంపిస్తున్నది.

దీనికి కొంతమంది

వలస కూలీలు జగ్గయ్యపేట పలు కర్మాగారాల నుండి , ఆంధ్రా తెలంగాణా బోర్డర్ లో రామాపురం ప్రభుత్వ చెక్ పోస్టులను దాటటానికి పొలాల వెంబడి దొడ్డి దారిన వలస కూలీలు

రోజుల తరబడి నడుచుకుంటూ వెళ్ళుతున్నట్లు వలస కూలీలు తెలియజేస్తున్నారు.

జగ్గయ్యపేట వివిధ కర్మాగారాల నుండి తెలంగాణా రాష్ట్రం నుండి వలస కూలీలు రోడ్డు

వెంబడి నడుచుకుంటూ వారి స్వగ్రామానికి బయలుదేరి వెళ్ళుతున్నట్లు తెలుస్తుంది.

వలస కూలీలకు రావలసిన డబ్బులకు కోత విదిస్తున్నట్లు వెళ్ళుతున్నవారు

తెలియజేస్తున్నారు. మూడు నెలల జీతాలు రావాలని కార్మికులు గత వారం రోజుల కిందట 1500 మంది రామ్ కో సిమెంట్ లొ ధర్నా నిర్వహించారు. అలాగే అఁల్టాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ

లొ ను అదే పరిస్థితి ఏర్పడింది.. కెసిపి సిమెంట్ లొ ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి..

ఇదే అదనుగా కర్మాగారాల కన్ను మూసి  à°•à°¾à°‚ట్రాక్టర్స్ కరోనా సందట్లో

సడేమియాలా వలస కూలీల జీతాలను జేబులో వేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. పోలీసు అధికారులు సైతం  à°•à°‚పెనీ, కాంట్రాక్టర్ లకే వత్తాసు పలికారని కూలీలు

ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం కరోనా వైరస్ పట్ల ఎన్నో అవగాహనలు కల్పిస్తూ వలస కూలీలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చే ప్రయత్నాలు చేస్తుంటే,వారిని

పంపించటానికి కర్మాగారాల కాంట్రాక్టర్స్ ట్రావెల్ ఖర్చులు చేయబడవస్తుందో నేమెానని వలస కూలీలను రోడ్డు పై వదిలిసినటుగా కనబడుతుంది.

కార్మగారాల

యాజమాన్యం తెచ్చింది కాంట్రాక్టర్ కాబట్టి అతను చూసుకుంటాడని చేతులు దులుపు కుంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కార్మికులకు అండగా నిలవాల్సిన వామపక్ష

పార్టీలు జాడ కాన రాలేదు.. 

ఏది ఏమైన కర్మాగారాలు ఈ సమయంలో ప్రభుత్వానికి సహకరించాల్సిన బాద్యతని గుర్తెరిగి కరోనా లాక్ డౌన్ సంధర్భంగా వలస కూలీల వివరాలను

ప్రభుత్వం దృష్టిలో పెట్టి జాగ్రతగా వారిని పంపించాల్సిన అవసరం ఉంది.

లేకపోతే వలస కూలీలు రోజల తరబడి నడక ప్రయాణంతో ముసలి , ముతక , చిన్న పిల్లలు తీవ్ర

ఇబ్బందులు పడుతారని,à°ˆ విధంగా చేస్తే మానవత్వం అనిపించుకోదని వలస కూలీల వ్యవహారంలో ప్రభుత్వానికి కర్మాగారాల యాజమాన్యం వారు సహకారానందించాలని  à°ªà°²à±à°µà±à°°à±

కోరుకుంటున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam