DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*ఎల్ జి పాలిమర్స్ లో స్టిరైన్  గ్యాస్ లీక్, ఊళ్ళకి ఊళ్లు ఖాళీ. .*

*విశాఖలో వేలాది మంది గ్రామస్తుల పరిస్థితి ప్రమాదకరం.*

*తెల్లవారి 3 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో స్టిరైన్ విషవాయువు లీక్* 

*విషవాయువుల తో దట్టమైన పొగమయంగా మారిన

ఆకాశం. . .*  

*ప్రాణాలు అరచేత పట్టుకుని వేలాది మంది రోడ్లపైకి పరుగులు* 

*జనం ఆసుపత్రికి తరలింపు-  à°®à±ƒà°¤à±à°² సంఖ్యా పెరిగే అవకాశం. . .*

*అమ్మోనియా గ్యాస్

కూడా కలవడంతో జనం అపస్మారక స్థితిలోకి. . .*

*అప్రమత్తం లో జిల్లా  à°…ధికారులు, అంబులెన్స్ లు. . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం,

మే 07, 2020 (డిఎన్ఎస్) : విశాఖ నగరంలోని సమీపంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో స్టిరైన్ విష వాయువు లీక్ కావడం తో భారీ

ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం 3 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో పరిశ్రమలో జరిగిన à°ˆ ప్రమాదం కారణంగా దట్టమైన మేఘాల మాదిరిగా వాయువులు గాలిలో కలిసిపోవడంతో సుమారు 6 à°•à°¿à°²à±‹à°®à±€à°Ÿà°°à±à°²

పరిధిలో గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. చిన్న పిల్లలు నుంచి వృద్ధులు, మహిళల వరకూ ప్రాణాలు అరిచేత పట్టుకుని వేలాది మంది ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.

అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడం తో నిద్రలోనే చాలామంది ఉన్నారు. అయితే వీళ్లందరినీ బస్సుల్లోనూ, అంబులెన్స్ ల్లోనూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
 
/> ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ వినయ్ చాంద్, నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా, తదితర అధికారులు, జాతీయ విపత్తు నివారణ రక్షణ బృందాలు భారీ

సంఖ్యలో పరిశ్రమకు చేరుకున్నారు. వీళ్లందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకునే ఏర్పాట్లలో ఉన్నారు. 

ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

కలక్టర్ ను à°ˆ ఘటనపై విచారించారు. స్థానిక ఎమ్మెల్యే పిజివిఆర్ నాయుడు, పెందుర్తి ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ తదితరులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. 

స్టిరైన్ తో

పాటు అమ్మోనియా గ్యాస్ కూడా కలవడంతో ప్రజలు అపస్మారక స్థితిలోకి వెళ్లడం జరుగుతుందని రసాయన శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. ఈ విష వాయువులు గాలిలో కలవడంతో

గాలిలోని ఆక్సిజన్ శాతం తగ్గి, ప్రజలు శ్వాస తీసుకోడానికి ఇబ్బంది à°•à°°à°‚à°—à°¾ మారింది.  

రెండు రోజుల క్రితమే పరిశ్రమ ప్రారంభం. . : 

లాక్ డౌన్ అనంతరం రెండు

రోజుల క్రితమే ఈ పరిశ్రమ ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే తాత్కాలిక సిబ్బందితో ప్రారంభించినట్టు ప్రాధమిక సమాచారం అందుతోంది. గత 35 రోజులుగా మూతబడిన రసాయన

సంస్థ తిరిగి ప్రారంభించినప్పుడు పూర్తి శిక్షణ పొందిన నిపుణులు తప్పని సరిగా ఉండవలసి ఉంది. అయితే సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తాత్కాలిక సిబ్బందితో

ప్రారంభించినట్టు తెలుస్తోంది. సంస్థ నిర్లక్క్ష్యం పై ప్రభుత్వం కేసులు పెట్టింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam