DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజలకు అనుమతులు ఇస్తున్నారు ఒకే. . .రైళ్లు ఎక్కడ? ఎప్పుడు?

*కేంద్రం - రాష్ట్రాల మధ్య కొలిక్కి రాని అంగీకారం . . .*

*ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ప్రజల ఎదురుచూపులు.*

*ఏపీ నుంచి బెంగుళూరు వెళ్లే వాళ్ళ పరిస్థితి

అగమ్య గోచరం.*

*రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన సూచనలు : . . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మే 08, 2020 (డిఎన్ఎస్) : లాక్ డౌన్

కారణంగా ఇతర ప్రాంతాల్లోనూ, రాష్ట్రాల్లోనూ చిక్కుకు పోయిన వేలాది మంది ప్రజలకు ఉపశమనం కల్పించే విధంగా అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న

విషయం తెలిసిందే. ప్రయాణీకులకు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి, అయితే ప్రత్యేక రైళ్లు, బస్సులు ఎప్పుడు నడుపుతారో మాత్రం చెప్పడం

లేదు. 

ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారు వెళ్ళవలసిన గమ్య స్థానాల రాష్ట్రాల అనుమతి కోరుతూ ప్రయాణికులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీని ప్రకారం ఇటీవలే

ఆంధ్ర ప్రదేశ్ లో చిక్కుకు పోయిన వందలాది మంది ప్రయాణీకులు వారి గమ్య స్థానాలైన బెంగుళూరు, చెన్నై, తెలంగాణా తదితర ప్రభుత్వాలకు దరఖాస్తు చేస్తున్నారు. వీరి

దరఖాస్తులను పరిశీలించి, వీరి ప్రయాణానికి అంగీకారాన్ని తెలియచేస్తూ ప్రయాణపు పాస్ లను అందిస్తున్నాయి. అయితే వీళ్ళకి సొంత వాహనాలు ఉంటె వాటిల్లో వెళ్ళవచ్చు.

లేని వారికోసం ప్రత్యేకంగా రైళ్లను, బస్సులను నడుపు కోవచ్చని కేంద్రం తెలిపింది. దీని ప్రకారం కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి అంగీకారం కూడా

వచ్చింది. అయితే ఈ నడిపే ప్రత్యేక రైళ్లకు అయ్యే ఖర్చును ఎవరు పెట్టుకోవాలి అనే అంశం పై ఒక కొలిక్కి రాకపోవడంతో రైళ్లు ఎప్పడినుంచి మొదలవుతాయి ఎవరికీ తెలియడం

లేదు. ప్రయాణీకులకు ప్రత్యేకంగా టికెట్లను అమ్మడం లేదని, ఎవ్వరూ టికెట్ల కోసం, రైల్వే స్టేషన్ లకు రావద్దంటూ  à°°à±ˆà°²à±à°µà±‡ ఇప్పడికే ప్రకటించింది. à°ˆ నేపథ్యంలో అనుమతి

పొందిన ప్రయాణీకుల పరిస్థితి ఏంటి అనేది సందిగ్ధం లో పడింది. 

బెంగుళూరు వెళ్లే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం: . . . .

లాక్ డౌన్ కు ముందు బెంగుళూరు నుంచి

ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చి గత 45 రోజులుగా చిక్కుకు పోయిన వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. వివిధ పనులపై విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ తదితర

ప్రాంతాలకు వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయారు. వీళ్ళలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రొం హోమ్ ద్వారా పనులు నిర్వహించుకునే అవకాశం ఉంది. ఇతర వ్యాపారస్తులు,

ఉద్యోగస్తులు దాదాపుగా చేతులెత్తేశారు. గత 45 రోజులుగా పక్కవారి పంచన నిలిచిపోయి కాలు బయట పెట్టలేని విధంగా మారిపోయింది. వీరిలో కుటుంబాలు వేరేచోట, వీళ్ళు

ఇంకోచోట ఉండిపోయారు.  

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన సూచనలు : . . .

ప్రయాణీకులు టిక్కెట్ల కోసం రైల్వే స్టేషన్ లకు రాకూడదు. 

కేవలం ప్రత్యేక

రైళ్లను రాష్ట్ర ప్రభుత్వాలే నడపాలి. 

ప్రత్యేక రైళ్లు మినహా ఇతర ప్యాసింజర్ రైళ్లన్నీ రద్దు చెయ్యబడతాయి. 

రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకే

ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. 

కేవలం ప్రభుత్వం అనుమతి పొందిన ప్రయాణీకులను మాత్రమే వీటిల్లో అనుమతించాలి. 

కేవలం రైల్వే శాఖా, రాష్ట్ర ప్రభుత్వాలు

ప్రకటించిన ప్రకటనలే అధికారికం. ఇతర ఊహాగానాలు నమ్మరాదు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam