DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గ్యాస్ లీకేజి అత్యంత దురదృష్టకరం. : బీజేపీ రాష్ట్ర చీఫ్ కన్నా 

*వెంటనే à°°à°‚à°—à°‚ లోకి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ à°·à°¾* 

*మానవ తప్పిదానికి అమాయకులు బలయ్యారు. . .* 

*ముఖ్యమంత్రి à°•à°¿ హృదయపూర్వక అభినందనలు* 

*కెజిహెచ్ లో

బాధితులకు కన్నా లక్ష్మీనారాయణ పరామర్శ* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మే 08, 2020 (డిఎన్ఎస్) : విశాఖ పరిసరాల్లోని ఎల్ జి పాలిమర్స్

గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరగడం అత్యంత దురదృష్టకరం అని భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

శుక్రవారం విశాఖ వచ్చిన అయన  à°ˆ ఘటన లో గాయాలపాలై స్థానిక కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. à°ˆ సందర్బంగా జరిగిన ఘటన పై వారిని

à°…à°¡à°¿à°—à°¿ వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు జరుగుతున్నా వైద్య చికిత్సలపై ఆసుపత్రి వైద్య బృందాలని à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. 

అనంతరం ఆసుపత్రి బయట ప్రాంగణం లో

విలేకరులతో మాట్లాడుతూ ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, ఇది కేవలం మానవ తప్పిదం అన్నారు. మానవ తప్పిదానికి ఎందరో అమాయకులు బలయ్యారన్నారు. మరెందరో పోరాటం

చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఘటన విషయం తెలిసిన వెంటనే భారత ప్రధాని నరేద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి తో మాట్లాడి, ఆవేదన వ్యక్తం

చేసారని, ఈ ప్రమాదాన్ని ఘోర విపత్తుగా ప్రకటించి, వీటి తీవ్రతను అదుపు చేసేందుకు గుజరాత్ నుంచి న్యూట్రాలిసర్స్ ను ఆఘమేఘాల మీద విశాఖ ను

పంపించారన్నారు. 

గ్యాస్ లీకేజీ నియంత్రణ కు అవసరమైన యాంటీ డాట్ ను గుజరాత్ నుండి పంపించడం జరిగింది. 

ఘటన జరిగిన అనంతరం భారతీయ జనతా పార్టీ క్యాడర్

ఘటన స్థలం కు చేరుకొని బాధితులకు అండగా నిలిచి వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించడమే కాక, వారికి తగిన ఆహార వసతులు అందించినందుకు అభినందించారు. ప్రజలు అందరూ

ఎంతో సంయమనం పాటించి ఘటన స్థలం నుంచి త్వరితగతిన సురక్షిత ప్రాంతాలకు చేర్చడమే కాక, అపోహలు ప్రచారం కాకుండా వాస్తవ సమాచారాన్ని ప్రజలకు అందించడం లో యువ మోర్చా

కీలక పాత్ర పోషించిందన్నారు. 

ఈ ఘటన పై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితి ని సమీక్షిస్తున్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తుంది. 

ఈ ప్రమాదం ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించిన తీరు, బాధిత కుటుంబాలకు

అండగా నిలబడి ఆ కుటుంబాలు నిలదొక్కుకునే విధంగా భారీ పరిహారం ప్రకటించడాన్ని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. అయితే విచారణకు అధికారులతో కాక, హై

కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలని కోరారు.  

అనంతరం ఘటన స్థలమైన ఎల్ జి పాలిమర్స్ సంస్థ కు వెళ్లి ఘటన జరిగిన వైనాన్ని తెలుసుకున్నారు. 

కన్నా

లక్ష్మీనారాయణ వెంట బీజేపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి సాగి కాశీ విశ్వనాధరాజు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు  à°¡à°¾à°•à±à°Ÿà°°à± కెవివివి

సత్యనారాయణ, ఆర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam