DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సేవే పరమావధిగా కృషి చేసిన కెజిహెచ్ హెడ్ నర్స్ పార్వతికి ఘన సమ్మానం.

సేవే పరమావధిగా కృషి చేసిన పార్వతికి ఘన సమ్మానం.

విశాఖపట్నం, జులై 04 ,  2018 (DNS Online ): వ్యాధిగ్రస్తుల సేవే పరమావధిగా మూడున్నర దశాబ్దాల కాలం సేవలందించిన విశాఖపట్నం

జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్య ఆరోగ్య కేంద్రం ( కింగ్ జార్జి ఆసుపత్రి) ప్రధాన నర్సు కొన్నగడ్డ పార్వతి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని కెజిహెచ్ సూపరింటెండెంట్

డాక్టర్ అర్జున్ వైద్య సిబ్బంది కొనియాడారు. బుధవారం కెజిహెచ్ లో జరిగిన కార్యక్రమం లో వైద్య సిబ్బంది, నర్శింగ్ విభాగపు ప్రతినిధులు ఆమెను ఘనంగా సమ్మానించారు. ఈ

సందర్బంగా అయన మాట్లాడుతూ వైద్యులు కేవలం చికిత్స మాత్రమే చేయగలరని, తదుపరి వ్యాధిగ్రస్తులకు తగిన వైద్య సహాయం చేసేవారే అత్యధిక ప్రాధాన్యులన్నారు. ఈ సేవలను

కేవలం నర్సింగ్ సిబ్బంది మాత్రమే చెయ్యగలరన్నారు. శస్త్ర చికిత్స విభాగం లో ఆమె నిర్వర్తించిన సేవలు అమోఘమన్నారు. ఎన్నో శస్త్రచికిత్సలో వైద్యులకు సహాయకారిగా

నిలిచి అందరి మన్ననలు పొందారన్నారు. అనంతరం సమాన గ్రహీత పార్వతి మాట్లాడుతూ బొబ్బిలి ప్రాంతం కు చెందిన తానూ పదవతరగతి పూర్తి చేసి 1981 నుంచి 1984 వరకు నర్సింగ్ శిక్షణ

పొంది, 1985 లో కింగ్ జార్జి ఆసుపత్రిలో ఉద్యోగం లో చేరినట్టు తెలిపారు. తదుపరి, మూడున్నర దశాబ్దాల కాలం పాటు ఎందరో సీనియర్ల వద్ద వైద్య సేవకు సంబంధించిన విషయాలను

తెలుసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారు ఎంతో సహనంతో విధులు నిర్వహిస్తున్నారని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాధిగ్రస్తులు, వారి సహాయకులకు

మెరుగైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమం లో కెజిహెచ్ లోని వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న నర్సింగ్ సిబ్బంది ఆమెను ఘనంగా సమ్మానించారు. పదవి

విరమణ తదుపరి ఆయు ఆరోగ్యాలతో మంచి విశ్రాంత జీవితాన్ని పొందాలని అభిలషించారు.      

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam