DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారతీయుల వాపస్ కోసం ఐ ఎన్ ఎస్ జలశ్వా తో ఆపరేషన్ సముద్ర సేతు

*ఐఎన్ఎస్ జలశ్వా లో మాల్దీవుల నుంచి 698 మంది స్వదేశానికి రాక*   

*మాలే నుంచి కోచి కి మొదటి విడత రవాణా సౌకర్యం.*

*అత్యంత కట్టుదిట్టమైన భద్రతల మధ్య పూర్తి

ఏర్పాట్లు. .*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, మే 09, 2020 (డిఎన్ఎస్) : దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ 3 నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో

చిక్కుకుపోయిన వారిని సొంత ప్రాంతాలకు వెళ్లే వెసులు బాటును భారత ప్రభుత్వం కల్పించింది. దీనిలో భాగంగానే మాల్దీవుల్లో చిక్కుకు పోయిన భారతీయులను

స్వదేశానికి తీసుకు వచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రారంభించినదే ఆపరేషన్ సముద్ర సేతు. భారతీయ నావికా దళంలో అత్యంత శక్తివంతమైన ఐ ఎన్ ఎస్ జలశ్వా నౌక ద్వారా మొదట దశ

లో భాగంగా శుక్రవారం మాల్దీవుల లోని మాలే నుంచి నౌకాశ్రయం నుంచి కేరళలోని కొచ్చి నౌకాశ్రయం వరకూ సుమారు 698 మంది భారతీయులను తీసుకువస్తున్నారు. 

అత్యంత

భద్రతల మధ్య భారత్ కు . . .

ఐ ఎన్ ఎస్ జలశ్వా నౌక లో ఎక్కవలసిన ప్రతి ప్రయాణీకుణ్ణీ క్షుణ్ణంగా పరిశీలించి, ముఖానికి మాస్క్ లు ఇచ్చి, శానిటైజర్లతో శుభ్రం

చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరినీ ప్రత్యేక  à°¬à°¸à±à°¸à±à°²à±à°²à±‹ నౌకాశ్రయానికి తరలించి, ప్రతి ఒక్క రవాణా సామాగ్రిని ద్రావకంతో శుభ్రం చేసి, అనంతరం నౌక లోకి అనుమతించారు.

ఈ మేరకు ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేసుకుని, వారికి తగిన సదుపాయాలను కల్పించారు. ఈ లోగా నౌకలోని ప్రతి క్యాబిన్, బెడ్, కేరేజ్ లను హైపో ద్రావకం తో శుభ్రం చేసి

సురక్షితంగా సిద్ధం చేసారు. ఈ తోలి విడత ప్రయాణం లో చిన్నారులు, మహిళలు, వృద్దులకు అవకాశం కల్పించారు. వీరందరికీ భారతీయ నౌకాదళ అధికారులు, సిబ్బంది వ్యక్తిగతంగా

సహాయ సహకారాలను అందించారు. ప్రతి దశలోనూ కనీస దూరాన్ని పాటిస్తూ, వారికీ కేటాయించిన బెడ్ లను కూడా అదే విధంగా అమర్చారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam