DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి మెడికల్ కాలేజీ కి మార్గం సుగమం: 

*ముఖ్యమంత్రికి జక్కంపూడి రాజా కృతజ్ఞతలు*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 09, 2020 (డిఎన్ఎస్) : తూర్పు గోదావరి జిల్లా

రాజమహేంద్రవరం మెడికల్‌ కాలేజీకి లైన్‌ క్లియర్‌ అయిందని కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే  à°œà°•à±à°•à°‚పూడి రాజా తెలిపారు. à°ˆ మేరకు శనివారం నగరం లోని

వైస్సార్ సిపి కార్యాలయంలో  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ సమావేశంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి à°•à°¿ కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు

మొదటిదశలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి యాభై ఎకరాల స్థలం అవసరం ఉందని ఎమ్మెల్యే రాజా పేర్కొంటూ,  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ ఉన్న ప్రభుత్వ

ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల ఏర్పాటు కానుందన్నారు. పేపర్ పరంగా 250పడకల ఆసుపత్రిగా ఉన్నప్పటికీ వివిధ విభాగాలు కల్పి  à°µà±†à°¯à±à°¯à°¿ పడకల ఆసుపత్రిగా

రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నడుస్తోందని,అయితే మెడికల్ కాలేజీ మంజూరుతో వెయ్యి పడకల ఆసుపత్రిగా అవతరిస్తుందని  à°µà°¿à°µà°°à°¿à°‚చారు.   అవసరమైతే  à°®à°°à±‹ 30 ఎకరాల భూసేకరణ

ప్రయత్నాలు చేస్తామని రాజా చెబుతూ ఇందుకోసం ఇప్పటికే రెండు మూడు చోట్ల ప్రభుత్వ భూములు పరిశీలించామన్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ వైద్య కళాశాల రాజమండ్రిలో ఏర్పాటు చేస్తే

స్థానికులతో పాటు ఇతర జిల్లాల వారికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. 

కరోనాపై చర్యలు ప్రశంసనీయం : . . . 

  కరోనా మహమ్మారి ని ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి

జగన్ చూపిన చొరవ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని ఎమ్మెల్యే రాజా పేర్కొన్నారు. అలాగే విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ తక్షణం స్పందించి, హుటాహుటీన

విశాఖ వెళ్లడం, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించడం,అస్వస్థతకు గురైన వారికి పరిహారం  à°µà°‚à°Ÿà°¿ చర్యలను ఆయన ప్రస్తావిస్తూ,గతంలో ఏ ప్రభుత్వం

ఇంతపెద్ద మొత్తాన్ని పరిహారంగా ఇవ్వలేదని గుర్తుచేసారు.

బూరుగుపూడి పై అధ్యయనం అవసరం : . . 

  కాగా   à°Žà°‚à°¤ ఖర్చయినా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇంటి స్థలం

అందించాలనేది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి à°•à°² అని గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే చర్యలు చేపడుతున్నామని జక్కపూడి రాజా తెలిపారు. అయితే బూరుగుపూడి దగ్గర

సేకరించిన భూమి గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లామని, ఆవ ప్రాంతంగా చెబుతున్నందున ఎత్తు చేసి ఇళ్ళు నిర్మిస్తే, వ్యవసాయ భూములకు ముంపు  à°‡à°¬à±à°¬à°‚ది వస్తుందన్న

వాదన ఉందని ఆయన పేర్కొన్నారు.  à°…ందుకే దీనిపై లోతైన అధ్యయనం జరగాల్సి ఉందని అయన à°’à°• ప్రశ్నకు సమాధానంగా వివరించారు. రైతులకు ఇబ్బంది కలిగేలా à°ˆ ప్రభుత్వం

వ్యవహరించబోదని అందుకే అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయాన్ని తీసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.

కార్యక్రమం లో నగర పార్టీ కో ఆర్డినేటర్

శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, నగర పార్టీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జాంపేట బ్యాంకు చైర్మన్ బొమ్మన రాజకుమార్,

మాజీ ఫ్లోర్ లీడర్లు మేడపాటి షర్మిల రెడ్డి, పోలు విజయలక్ష్మి, నాయకులు దాసి వెంకట్రావు, నక్కా శ్రీనగేష్,మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam