DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 18 నుంచి రోడ్ల పైకి ఆంధ్రాలో ప్రగతి రధ చక్రం?*

*సీట్ల సద్దుబాటు కసరత్తులో ప్రజా రవాణా సంస్థ,* 

*లగ్జరీలో 26, పల్లె వెలుగులో 34 మందికే చోటు*

*ప్రయాణం కావాలంటే అదనపు భారం తప్పదు. ..* 

*ప్రతి డిపో నుంచి

అతి కొద్దీ సంఖ్యలో బస్సులు సిద్ధం*

*బస్సు ఎక్కితే డ్రైవర్ చేత్తో రక్షణ చుక్క పడుతుంది,* 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి): . .
 
అమరావతి, మే 11, 2020 (డి ఎన్

ఎస్ ): ఈ నెల 18 నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజా రవాణా సంస్థ ప్రగతి రధం చక్రం రోడ్లపైకి రానుంది. ఈ మేరకు ప్రజా రవాణా సంస్థ ఒక బృహత్తర ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు

వచ్చింది. దీని ప్రకారం. అత్యంత కట్టుదిట్టమైన ప్రజా రక్షణ తో అడుగులు ముందుకు పడుతున్నాయి. కొవిడ్‌-19 ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌ నుంచి ఒక్కొక్కటిగా

సడలింపులు వస్తుండటంతో ప్రజా రవాణా విభాగం అధికారులు బస్సులను సిద్ధం చేస్తున్నారు. కనీస దూరం పాటించేలా బస్సుల్లో సీట్లను సర్దుబాటు చేస్తోంది. సగం సీట్ల

టికెట్లతోనే పూర్తి బస్సు నడవనుంది. దీనికై అదనపు భారాన్ని ప్రయాణ టికెట్ల పై మోటమ్రోగించనుంది. 

ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు

బస్సులున్నాయి. దూర ప్రాంతాలకు సూపర్‌ లగ్జరీ, అలా్ట్ర డీలక్స్‌ సర్వీసులున్నాయి. రాష్ట్రం బయటికి వెళ్లే వాటిలో ఎక్కువగా ఏసీ బస్సులు ఉన్నాయి. పల్లెవెలుగు

బస్సులో 60 సీట్ల కెపాసిటీ ఉండగా, ఇకపై 34మందికి మించకుండా తీసుకెళ్తారు. ముగ్గురు కూర్చునే సీట్లలో మధ్యలో వదిలేసి ఇద్దరికే  à°…వకాశమిస్తారు. ఇద్దరు కూర్చునే

సీట్లలో ఒక్కరినే కూర్చోబెడతారు. ఫలితంగా 26 సీట్లు ఖాళీగా వదిలాల్సి ఉంటుంది. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే 40శాతం చార్జీ పెంచాల్సిందే అంటున్నారు అధికారులు. ఇక

సూపర్‌లగ్జరీ బస్సులో రెండు వరుసలుగా 36 సీట్లు ఉంటాయి

అటు తొమ్మిది, ఇటు తొమ్మిది తొలగించి మధ్యలో ప్రయాణీకులు నడిచే ప్రాంతంలో 8 సీట్లు కొత్తగా అమర్చారు.

దీంతో ఇకపై à°ˆ బస్సుల్లో 26మందికి మించి ప్రయాణించడం సాధ్యం కాదు. కనీసం 30శాతానికిపైగా నష్టాల్ని à°­à°°à°¿à°‚à°šà°• తప్పదు. అలా్ట్ర డీలక్స్‌ బస్సుల్లో ప్రస్తుతం 40

సీట్లున్నాయి. కుడివైపు పది, à°Žà°¡à°® పది సీట్లు తొలగించి మధ్యలో 8 అమర్చుతున్నారు. అంటే 12 సీట్లు తగ్గుతాయి. à°ˆ నెల 18 నాటికి ప్రతి బస్‌ డిపోలోనూ 4 నుంచి 12 బస్సుల వరకు à°† మేరకు

సీట్లు సర్దుబాటు చేయనున్నారు. అలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 128 బస్‌ డిపోల నుంచి మొత్తం సుమారు 800 బస్సులకు సీట్ల సర్దుబాటు వచ్చే ఆదివారం నాటికి పూర్తవుతుందని

పీటీడీ అధికారులు చెబుతున్నారు. 

ఏసీ బస్సుల్లో సగం సీట్లే..

దూర ప్రాంతాలతోపాటు రాష్ట్రం దాటి వెళ్లే ఏసీ బస్సుల్లో సీట్ల మార్పులు చేయడం లేదని

పీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇంద్ర సర్వీసుల్లో రెండు సీట్లు చొప్పున రెండు వరుసల్లో 40 సీట్లు ఉండగా ఒక్కో ప్రయాణికుడికే అనుమతించాలని భావిస్తున్నారు.

అమరావతి బస్సుల్లో 48 సీట్లు ఉంటే అందులో సగం సీట్లే భర్తీ చేస్తారు.  

బస్సెక్కగానే చేతిలో రెండు చుక్కలు..

à°ˆ బస్సుల్లో కండక్టర్‌ ఉండరని, కేవలం డ్రైవర్

తోనే ప్రయాణం సాగించనున్నట్టు తెలుస్తోంది.  à°¸à±€à°Ÿà±à°²à°•à± మించి ఒక్క ప్రయాణికుడిని కూడా ఎక్కించబోమని, ప్రతిదీ గ్రౌండ్‌ బుకింగ్‌ చేసిన తర్వాత డ్రైవర్‌ను

మాత్రమే పంపుతామని చెబుతున్నారు. ప్రతి ప్రయాణికుడికి చేతిలో శానిటైజర్‌ వేయాలన్న ఆలోచన ఉందని, à°† బాధ్యత డ్రైవర్‌కు అప్పగిస్తామంటున్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam