DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రయాణీకుల వివరాలు సమగ్రంగా పొందుపర్చాలి: క్రిష్ణ బాబు

*రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. క్రిష్ణ బాబు*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*
 
శ్రీకాకుళం, మే 11 ,2020 (డిఎన్ఎస్ ): శ్రీకాకుళం జిల్లాకు

మంగళవారం రైలు రానుందని, అందులో వచ్చే ప్రయాణీకుల వివరాలను సమగ్రంగా పొందుపరచుకోవాలని రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి యం.టి.కృష్ణబాబు పేర్కొన్నారు. సోమవారం

సాయంత్రం ఆరోగ్య శాఖ కమీషనర్ కె. భాస్కర్తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. à°ˆ సందర్భంగా మాట్లాడుతూ  à°®à°‚గళవారం ఉదయం 06.00 గంటలకు శ్రీకాకుళం పట్టణానికి

రైలు వస్తుందని చెప్పారు. అందులో వచ్చే ప్రయాణీకుల వివరాలు సమగ్రంగా పొందుపర్చుకోవాలని సూచించారు. వారిని క్వారంటైన్ లో ఉంచేందుకు తగు ఏర్పాట్లు చేయాలని

జిల్లా కలెక్టర్ జె.నివాస్ కు సూచించారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యక్తుల వివరాలను ఆయా రాష్ట్రాలు తెలియజేయడం ద్వారా సమాచారం మరింత సులభతరం

అవుతుందని అన్నారు.

జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బస్సులు పెట్టి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. కొంత మంది

బృందాలుగా ఏర్పడి బస్సులు ఏర్పాటు చేసుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారని , à°† సమాచారం క్రమ పద్ధతిలో అందాలని  à°•à±‹à°°à°¾à°°à±.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా

కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ తమిళనాడు నుండి 8 వందల మంది వలస కార్మికులు ప్రత్యేక ట్రైన్ లో జిల్లాకు రానున్నారని చెప్పారు. వీరంతా మంగళవారం ఉదయం 06.00గం.లకు

చేరుకుంటారని అన్నారు. కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించుటకు శిబిరాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన సమన్వయ అధికారులను

నియమించాలని జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధిని కలెక్టర్ ఆదేశించారు. వారిని తక్షణమే సహాయక కేంద్రాలకు తరలించాలని సూచించారు.

ఈ సమావేశంలో జాయింట్

కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రోజెక్ట్ అధికారి సిఎం. సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, జిల్లా రెవిన్యూ అధికారి

బి.దయానిధి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఎం.చెంచయ్య, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా.ఏ.కృష్ణ మూర్తి, డిసిహెచ్ఎస్ బి.సూర్యారావు, జిల్లా

గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఏ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి సాయిరాం, నగర పాలక సంస్థ

కమీషనర్ పి.నల్లనయ్య, ఆరోగ్య అధికారి జి.వెంకట రావు, ఇన్ ఛార్జి రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్.గణపతి, ప్రత్యేక ఉప కలెక్టర్ అప్పారావు, విపత్తుల విభాగం ఇన్ ఛార్జి

డిఎం బి.నగేష్, ప్రత్యేక అధికారి జి.శ్రీనివాసరావు, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డా.బి.జగన్నాథ రావు, డా.రామ్మోహన్, డా.

కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam