DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14న ఏకాంతంలోనే అరసవల్లిలో ఆదిత్యుని క్షీరాభిషేకం 

*అరసవల్లి ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*
 
శ్రీకాకుళం, మే 12, 2020 (డిఎన్ఎస్ ): శ్రీకాకుళం జిల్లా అరసవల్లి

శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఈ నెల 14న క్షీరాభిషేకం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. కేంద్ర రాష్ట్రాలు ఆదేశాల మేరకు ఈ అభిషేక

సేవకు ఎవరిని అనుమతించడం లేదని పేర్కొన్నారు.  
వృషభ సంక్రమణం (హరిపద పుణ్యకాలం) వైశాఖ బహుళ సప్తమి సందర్భంగా గురువారం ఉదయం నాలుగు గంటలకు స్వామివారి అభిషేకం

జరిపిస్తామని అన్నారు. పాలు పెరుగు తేనె పంచదార నెయ్యి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి క్షీరాభిషేకం వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. అలాగే ఈ సేవకు

భక్తులను అనుమతించడం లేదని కేవలం తక్కువ మంది అర్చకులు, వైదిక సిబ్బంది మాత్రమే హాజరు అవుతారని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ సూర్యనారాయణ

స్వామివారిని ఆరోజు భక్తులంతా ఉదయం స్వామివారికి ప్రీతి అయిన క్షీరాన్నం వండి నైవేద్యం చూపి కరోనా మహమ్మారి ప్రబలకుండా ఉండాలని స్వామివారికి నమస్కరించాలని

ఆయన కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam