DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమలలో మీడియా తప్పులపై టీవీల్లో చర్చలు పెట్టాలి:  భక్తులు

*మద్యం, మాంసం తో ఒకడు దొరికాడు, దొరకని వాళ్ళెందరున్నారో ?*     

*మీడియా తప్పిదం టీవీల్లో డిబేట్ పెట్టాలని భక్తుల డిమాండ్* 

*గతంలోనూ చాలామంది మీడియా

వాళ్ళు తప్పులతో దొరికారు.*

లాక్ డౌన్ లో తిరుమల కొండపై మీడియా కి పనేంటి? భక్తులు. .

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖ పట్నం)*

విశాఖ పట్నం,

మే 13, 2020 (డిఎన్ఎస్ ): అత్యంత పవిత్రమైన తిరుమల క్షేత్రంలో  à°ªà°µà°¿à°¤à±à°°à°¤à°¨à± బ్రష్టుపాటించడం లో మీడియా పాత్ర కీలకంగా మారిందని హిందూ ధార్మిక సంఘాలు, భక్తులు

మండిపడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో భక్తులెవ్వరికీ తిరుమలకు వెళ్లే అనుమతి లేనప్పుడు మీడియా కు కొండమీద పనేంటి అని ప్రశ్నిస్తున్నారు. బుధవారం అలిపిరి వద్ద ఒక

మీడియా వ్యక్తి ని రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఘటన పై అన్ని మీడియా ఛానెళ్ళలోనూ బహిరంగా చర్చలు పెట్టాలని హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై వివిధ

అర్చక వర్గాలు, వైదిక ప్రచార సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నాయి. 

హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి టీవీ చానెళ్లు ముందుకు వస్తుంటాయని, అదే మీడియా

చేసే తప్పులను మాత్రం చూపించేందుకు ముందుకు రావన్నారు. హిందూ పండగలను సమాజానికి ద్రోహం చేసేవిగా చూపించడం లో అత్యుత్సాహం చూపించే మీడియా చానెళ్లు, అదే

పండగలకు ప్రకటనల పేరిట దోచుకోడానికి ఏమాత్రం సిగ్గు పడడం లేదని మండిపడుతున్నాయన్నారు. 

గతంలోనూ తిరుమల క్షేత్ర పరిసరాల్లో తప్పులు చేస్తూ చాలామంది

మీడియా ప్రతినిధులు దొరికిన ఘటనలు ఉన్నాయని, హైందవ సంఘాలు మండిపడుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో కొండ మీదకు వెళ్లేందుకు మీడియా కు ఎలా అనుమతి ఇచ్చారని

ప్రశ్నిస్తున్నారు. కొండమీద అన్ని కార్యక్రమాలూ కేవలం ఏకాంతంలోనే జరుగుతున్నప్పుడు, మీడియా కు అక్కడ పనేంటి అని ప్రశ్నిస్తున్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam