DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇళ్ల స్థలాల పథకంలో అవినీతి, ఆరోపణలకు తావులేదు

తూర్పుగోదావరి జిల్లా కలక్టర్ డి మురళీధర్ రెడ్డి

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 14, 2020 (డి ఎన్ ఎస్ ): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల

స్థలాల పధకంలో ఎటువంటి అవినీతికి, అక్రమాలకు తావులేదని తూర్పుగోదావరి జిల్లా కలక్టర్ à°¡à°¿ మురళీధర్ రెడ్డి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం సబ్

కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన వివిధ పార్టీల ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వ ఇళ్ల స్థలాల సంబంధించి పలువిషయాలపై

చర్చించారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు 2350 కోట్లు కేటాయించి 3 లక్షల మందికి ప్రయోజనం కలిగించేవిధంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ అసైన్డ్ భూములలో

భూసేకరణ నిర్వహిస్తూ ఆయా భూముల విలువలను బట్టి రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో సొమ్మువెయ్యడం జరుగుతుందని ఈ విషయంలో ఎటువంటి అవకతవకలకు తావులేదన్నారు.

వీటిపై పిర్యాదులు ఉన్నట్లయితే 14400 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చెయ్యాలని అన్నారు. జిల్లాలో 7 వేల ఎకరాలకు గాను 7 వందల ఎకరాలకు ఒక మీటర్ ఎత్తు ఫిల్లింగ్

చేస్తున్నామన్నారు. కోరుకొండ మండలం బూరుగుపూడి, కాపవరం వద్ద భూములకు సంబంధించి పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్

రామ్, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చ్చయ్య చౌదరి జిల్లా కలెక్టర్ తో చెర్చించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ,

రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, మునిసిపల్ కమీషనర్ అభిషిక్త్ కిషోర్, ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam