DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానవాళి జీవన పునర్వైభవం కోసం బద్రీనాధ్ లో ప్రత్యేక పూజలు 

*కరోనా బారి నుంచి కాపాడమంటూ ప్రధాని పేరిట తోలి పూజ* 
  
*ఏకాంతంలోనే తిరిగి తెరుచుకున్న ఆలయ ద్వారాలు . . .*

*కేవలం 28 మంది కి మాత్రమే బదరి ఆలయ

ప్రవేశం.* 

*కనుచూపు మేరలో కానరాని భక్తజనం. బోసిపోయిన మంచు పర్వతం* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )*

విశాఖపట్నం, మే 16, 2020 (డి ఎన్ ఎస్ ): బద్రీనాధ్ . .

.à°ˆ క్షేత్రం పేరు చెప్పగానే కోట్లాదిమంది హిందువుల్లో ఎంతో ఉత్తేజం కలుగుతుంది. ఏడాది లో కేవలం ఆరు నెలలు మూసి ఉండే à°ˆ ఆలయం ద్వారాలు శుక్రవారం ( మే  15 à°¨)

తెరుచుకున్నాయి. ఈ ద్వారాలు తెరిచే రోజున లక్షలాది గా భక్తజనం ఈ ప్రాంతానికి చేరుకొని, స్వామిని తోలి దర్శనం చేసుకుంటారు. అయితే ఈ ఏడాది కరోనా రాక్షసుడి ప్రభావం

ఎక్కువగా ఉండడంతో భక్తులకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కేవలం 28 మంది అర్చకులు, అధికారులు, రక్షణ బలగాలు మాత్రమే స్వామిని తోలి దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. సర్వ

మానవాళి సుఖ శాంతులతో ఉండాలని, మానవాళి మనుగడ తిరిగి పూర్తి స్థాయిలోకి రావాలని బదరి నారాయణుని కోరుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరిట తోలి పూజ నిర్వహించారు

అర్చకులు.  à°•à±‡à°µà°²à°‚ అతి తక్కువ మంది పరివారానికి అనుమతి ఇవ్వడంతో జోషిమఠ్ నుంచి బదరి నారాయణుల ఉత్సవ మూర్తులను పాండుకేశ్వర్ కు గురువారం రాత్రికి తీసుకువచ్చారు.

తదుపరి, శుక్రవారం తెల్లవారు ఝామునే 4 :30 గంటలకు బదరి నాధ్ ఆలయ ప్రాంగణానికి చేరుకొని, ఆలయాన్ని తెరవడం తో బదరీనాధ్ యాత్ర ఆరంభమైంది.    

సైనిక పహారాలోనే భద్రతా  .

. . 

బదరి నాధ్ క్షేత్రం కొలువైనది పవిత్ర హిమాలయ పర్వతాలు (ఉత్తరాఖండ్) కావడంతో భారతీయ సైనిక బలగాలు సంపూర్ణ రక్షణ వలయంలోనే కొలువుతుంది. శుక్రవారం ఆలయ

ద్వారాలు తెరవ వలసి ఉండడంతో అత్యున్నత సైనిక అధికారులు వెంటరాగా ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రవేశం చేయించారు అర్చక బృందాలు.   

కనుచూపు మేరలో కానరాని

భక్తజనం:

మంచు ప్రభావంతో కేవలం 6 నెలలు ఆలయాన్ని మూసి వెయ్యడం జరుగుతుంది. కేవలం  6 నెలలు మాత్రమే లభించే à°ˆ ఆలయ దర్శనం కోసం కోట్లాదిమంది తపిస్తుంటారు. మంచు

ప్రభావంతో ఆరు నెలల కాలం పాటు ఆలయాన్ని మూసివేసి, ఉత్సవ మూర్తులను సమీపంలోని జోషి మఠ్ కు తరలిస్తుంటారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం గత నెల (ఏప్రిల్) 30 నే

తెరవవలసి యుంది, అయితే  à°•à°°à±‹à°¨à°¾ ప్రభావం కారణంగా మే 15 కు వాయిదా వేయడం జరిగింది. భక్తులకు అనుమతి లేకపోవడం తో ప్రతి ఏడాది భక్తులు, సాధువులు, సంత్ లతో కిటకిటలాడే బదరి

క్షేత్రం నేడు పూర్తిగా బోసిపోయినట్టయ్యింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam