DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల శ్రీవారి లడ్డూ అమ్మకాలు మొదలు, భారీగా  భక్తులు

*కరోనా విజృంభణ నేపథ్యంలో నిలిచిన విక్రయాలు*

*55 రోజుల పాటు శ్రీవారి దర్శనం కూడా బంద్*‌

*ఏకాంతంలోనే స్వామి ఆరాధనలు, నిత్య కైంకర్యాలు* 

*(DNS రిపోర్ట్ :

రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 16, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°•à°°à±‹à°¨à°¾ విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారి

లడ్డూ ప్రసాదం విక్రయాలు శనివారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని ప్రధాన పరిపాలన భవనం వద్ద వీటిని అమ్ముతున్నారు. లాక్‌డౌన్‌ వాళ్ళ  55 రోజుల పాటు

విక్రయాలు నిలిచిపోయిన శ్రీవారి లడ్డూలను మళ్లీ భక్తులు పొందే అవకాశం లభించింది. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనం వెనుక ఉన్న లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రం

ద్వారా ఇవాళ్టి నుంచి  à°ªà±à°°à°¤à°¿ రోజూ 500 శ్రీవారి కల్యాణోత్సవ లడ్డూు, 500 వడలు ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. 
లడ్డూ విక్రయాలు ప్రారంభమయ్యాయని

 à°¤à±†à°²à±à°¸à±à°•à±à°¨à±à°¨ భక్తులు à°ˆ రోజు వాటి కోసం భారీగా తరలిరావడం గమనార్హం. 

కరోనా విజృంభణతో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. స్వామి వారి నిత్య

కైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్వహిస్తున్నారు. సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ పరిమిత సంఖ్యలో త్వరలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ

అధికారులు భావిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam