DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో గ్యాస్ లీక్, . . నిన్న విశాఖ నేడు తూగో జిల్లా

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 16, 2020 (డి ఎన్ ఎస్ ): విశాఖపట్నం లోని ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువక ముందే కృష్ణా జిల్లాలోని కైకలూరు మండలం ఆలపాడులో

మరో గ్యాస్ లీకేజీ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో à°ˆ మధ్య వరుస గ్యాస్ లీక్ ఘటనలు జరుగుతున్నాయి.  à°¤à°¾à°œà°¾à°—à°¾.. తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే

చోటుచేసుకుంది. రాజోలులో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. మలికిపురం మండలం తూర్పుపాలెం దగ్గర ఈ గ్యాస్ లీకవుతోంది. ఈ ఘటనతో స్థానికులు

భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు లీకేజీని అదుపులోకి తెచ్చేందుకు ప్రతయ్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే

గ్యాస్ ఎలా లీకయ్యింది..? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది..? అనే విషయాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఫిబ్రవరిలో

తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామానికి సమీపంలో డ్రిల్లింగ్‌ సైట్‌ నుంచి అకస్మాత్తుగా భారీ శబ్ధంతో గ్యాస్‌ లీక్‌ అయ్యింది. అప్పట్లో

ఓఎన్‌జీసీ అధికారులు అప్రమత్తమై ఉప్పూడితోపాటు పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. ఫైర్‌ ఇంజన్లను తెప్పించి తీవ్రఒత్తిడితో లీక్‌ అవుతున్న గ్యాస్‌ను

అదుపుచేశారు. అయితే తాజాగా మరోసారి గ్యాస్ లీకవ్వడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు.

కృష్ణా జిల్లాలో ఏమైంది..!

కాగా.. కృష్ణా జిల్లాలో శ్రీకాంత్

రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. దీంతో అక్కడే ఉన్న నలుగురు మహిళలు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు అస్వస్థతకు

గురైన వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న కైకలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam