DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మే 31 వరకు లాక్ డౌన్ పొడిగింపు, రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు 

*రాష్ట్రాలకు స్వేచ్ఛ. . . కొన్ని తెరుచుకునే వెసులుబాటు.*  

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 17, 2020 (డి ఎన్ ఎస్ ): దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 ను

కొనసాగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్రాలకు కొన్ని వెసులుబాటు కల్పించింది. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా

కేంద్రం మినహాయింపులు ఇచ్చింది. ఆర్టీసీ బస్సులు, స్థానిక రవాణాపై రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం వదిలేసింది. జోన్లలో అనుసరించాల్సిన విధివిధానాలపైనా

రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంది. రాష్ట్రాలకు  à°ªà±‚ర్తి అధికారం ఇవ్వాలని, కేంద్రం నిబంధనలతో రాష్ట్రాలు నష్టపోతున్నాయని సీఎంలు చేసిన ఫిర్యాదుతో వెసులుబాటు

ఇచ్చిన కేంద్రం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయికి చేరుతున్న సమయంలో నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్రాలు కఠినంగా ఉండాల్సిందేని తెలిపింది.

కరోనా కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్రాలపై కఠినంగా వ్యవహరించేందుకు వెనుకాడబోమని కేంద్రం సంకేతం ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం

పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. 

అయితే. . .అధిక సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు సంచరించే స్కూళ్లు,

కాలేజీలు, మాల్స్, సినిమా హాళ్ల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదన్న కేంద్రం తెలిపింది. రాత్రి వేళల్లో కర్ఫ్యూ మాత్రం కొనసాగనుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam