DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్తులకు అండగా హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ 

*నగరం లో కొనసాగుతున్న కూరగాయల వితరణ కార్యక్రమం.* 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

విశాఖపట్నం, మే 18, 2020 (డి ఎన్ ఎస్ ): విశాఖపట్నం నగరం లోని

దొండపర్తి ప్రాంతం లో గల వైర్లెస్ కాలనీ రామాలయంలో శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు పలురకాల కూరగాయలు పంపిణీ చేపట్టారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ని ఎదుర్కొనే భాగంగా లాక్ డౌన్ 4 .0 కొనసాగుతున్న నేపథ్యంలో పేదలు కూరగాయలు కొనుక్కునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని

వారికి అండగా నిలిచేందుకు శ్రీ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ వారు ఇప్పటికే మూడు దఫాలు బియ్యం ' కాయగూరలు తదితర నిత్యావసర సరుకులు అందజేశామని ట్రస్టు

అధ్యక్షులు రమణమూర్తి తెలియజేశారు. సుమారు వందమంది పేదలకు ఈరోజు కాయగూరలు పంపిణీ జరిపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు కార్యవర్గం కోటేశ్వరరావు, కడగల

శ్రీనివాస్, అప్పారావు, అవతార్ ఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam