DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉదయం 7 నుండి 1 గంట వరకు కిరణా – కలెక్టర్ నివాస్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 18, 2020 (డిఎన్ఎస్ ): లాక్ డౌన్ కాలంలో కిరాణా సామగ్రిని ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

విక్రయించుటకు అనుమతులు ఇస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. గతంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విక్రయాలకు అనుమతించడం

జరిగందని అయితే కొంత మంది మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతించాలనే అభ్యర్ధన మేరకు సమయాన్ని మార్చుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. సోమ వారం ఉదయం ఐ అండ్ పిఆర్ తో జిల్లా

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ గతంలో కూరగాయలు, పండ్లకు మాత్రమే మధ్యాహ్నం వరకు అనుమతించామని దానిని ఇకపై కిరాణా సామగ్రికి కూడా

వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. ఇతర దుకాణాలు యధావిధిగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని చెప్పారు. బట్టలు, బంగారం, చెప్పులు, సెలూన్లకు అనుమతి

లేదని ఆయన స్పష్టం చేసారు. మద్యం దుకాణాల వద్ద విధిగా గొడుగులు వేసుకుని రావాలని తెలిపారు.

బయట నుండి వచ్చిన వారి పట్ల వివక్ష వద్దు : ఇతర ప్రాంతాల నుండి

జిల్లాకు వస్తున్న వలస కార్మికుల పట్ల వివక్ష వద్దని జిల్లా కలెక్టర్ నివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. వారి పట్ల ఎటువంటి సామాజిక వివక్ష ఉండరాదని ఆయన అన్నారు.

సామాజిక వివక్ష చూపే వారిపై చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. వలస కార్మికల పట్ల ఎటువంటి ద్వేషం వద్దు అని పిలుపునిచ్చారు. బ్రతుకు తెరువు కోసం వెళ్ళారని, వారికి

కరోనా వస్తుందని తెలియదని చెప్పారు. కరోనా ఎవరికైనా రావచ్చు, ఎక్కడి వారికైనా రావచ్చునని కలెక్టర్ అన్నారు. బయట నుండి వస్తున్న వారిని జిల్లాలో క్వారంటీన్, సహాయ

కేంద్రాల్లో పెడుతున్నామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 14 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి విదితమేనని చెప్పారు. వ్యక్తుల మధ్య దూరం పాటించడం, మాస్కులు

ధరించడం, శానిటైజర్లు ఉపయోగించడం, సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు తరచూ చేతులు శుభ్రపరచుకోవడం చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుండి వస్తున్నవారి పట్ల మాత్రం

అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లాలో మరిన్ని కేసులు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కరోనా పట్ల భయబ్రాంతులు చెందాల్సిన అవసరం లేదని అన్నారు. జిల్లాలో

రోజుకు వెయ్యి మందికి పైగా పరీక్షలు నిర్వహించుకునే సౌకర్యం ఏర్పాటు చేసుకున్నామని, వస్తున్న ప్రతి ఒక్కరిని పరీక్షిస్తామని వివరించారు. ఎక్కువ కేసులు

వచ్చినపుడు ఆసుపత్రుల్లో సౌకర్యాలు చాలకపోవచ్చని అటువంటి సమయంలో ఇళ్ళ వద్దనే వైద్య చికిత్స అందించాల్సి ఉంటుందని అన్నారు. ఈ విధానం ఇప్పటికే తమిళనాడు వంటి

రాష్ట్రాల్లో అవలంభిస్తున్నారని చెప్పారు. కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ పూర్తి జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. వచ్చే ఒకటి , రెండు నెలలు కీలకమని కలెక్టర్

అన్నారు. జిల్లాలో కరోనా భారీన పడినవారికి వైద్య సేవలు అందించుటకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.  4à°µ విడత లాక్ డౌన్ సోమ వారం నుండి ప్రారంభం అయిందని, ఇప్పటి వరకు 52

రోజులుగా సాగిన లాక్ డౌన్ లో జిల్లా ప్రజలు మంచి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. 4వ విడత లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసిందని,

రాష్ట్రంలో చేపట్టాల్సిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. జిల్లాల మధ్య రవాణా వ్యవస్ధపై రాష్ట్ర ప్రభుత్వం

నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.

à°ˆ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam