DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గురువారం నుంచి 138 ప్రజా రవాణా సంస్థ బస్సులు ప్రారంభం

శ్రీకాకుళం జిల్లా నుండి 73, విజయనగరం జిల్లా నుండి 65 బస్సులు 

శ్రీకాకుళం జిల్లా డెప్యూటీ సి.à°Ÿà°¿.యం జి.వరలక్ష్మీ వెల్లడి 

(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి.

బ్యూరో, శ్రీకాకుళం)

శ్రీకాకుళం, మే 20, 2020 (డిఎన్ఎస్ ): గురువారం నుంచి  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లాలో ఆర్.à°Ÿà°¿.సి ( ప్రజా రవాణా శాఖ )  à°¬à°¸à±à°¸à±à°²à± పునఃప్రారంభం కానున్నట్లు

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.వరలక్ష్మీ పేర్కొన్నారు. లాక్ డౌన్ నేపధ్యంలో à°—à°¤ 58 రోజులుగా ఆర్.à°Ÿà°¿.సి బస్సులను నిలిపివేయడం జరిగిందని,

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గురువారం నుండి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ప్రారంభం అవుతున్నాయని ఆమె చెప్పారు. 

తమ పరిధిలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం

జిల్లాలకు సంబంధించి మొత్తం 138 బస్సులను ఏర్పాటుచేయడం జరిగిందని, ఇందులో శ్రీకాకుళం జిల్లా నుండి 73, విజయనగరం జిల్లా నుండి 65 బస్సులు నడుస్తాయని, ఇవి విశాఖపట్నం

వరకు నడపబడతాయని ఆమె స్పష్టం చేసారు. ప్రతీ రోజూ ఉదయం 07.00గం.ల నుండి రాత్రి 07.00గం.ల వరకు ప్రయాణీకులను గమ్యానికి చేరవేసేందుకు బస్సులను సిద్ధం చేసినట్లు చెప్పారు.

ప్రయాణీకుల రద్దీని దృష్ట్యా అవసరమైన రూట్లలో ముందుగా బస్సులను ప్రారంభిస్తున్నామని, భవిష్యత్తులో కరోనా ప్రమాదం లేదని బావిస్తే బస్సుల సంఖ్యను మరింత

పెంచేందుకు ఆలోచన చేస్తామని చెప్పారు.  

బస్సు ఎక్కాలంటే నిబంధనలు ఇవే: . . 

బస్సులలో ప్రయాణించేవారు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఆమె

సూచించారు. ప్రయాణీకులు మాస్కులను ధరించాలని, ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పారు. ప్రతీ బస్సు డిపోల వద్ద శానిటైజర్ మెషీన్లను ఏర్పాటు చేయడం

జరిగిందని, వాటి ద్వారా ప్రయాణీకులు చేతులను పరిశుభ్రం చేసుకొన్న తరువాతే బస్సులలో ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నారు.  

65ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్ల వయస్సు లోపు గల

వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, అందువలన అటువంటి వారికి  à°¬à°¸à±à°¸à±à°²à°²à±‹ ప్రయాణానికి అనుమతి లేదని ఆమె స్పష్టం చేసారు. బస్సులలో టికెట్లు

విక్రయించబడవని, బస్సులలో ప్రయాణించాలనుకునేవారు నిర్ధేశిత కౌంటర్ల వద్ద టికెట్లను పొంది ప్రయాణించాలని తెలిపారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె

కోరారు.

జూన్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారానే టికెట్లను పొంది ప్రయాణించవచ్చని తెలిపారు.  à°•à°°à±‹à°¨à°¾ నేపధ్యంలో  20 శాతం బస్సులను మాత్రమే

నడుపుతున్నామని, బస్సులలో 3 సీట్లకు ఇద్దరు, రెండు సీట్లకు ఒకరు మాత్రమే ఉండేవిధంగా టికెట్లను విక్రయించడం జరుగుతుందన్నారు.

పల్లెవెలుగుకు 35 మంది, ఎక్స్

ప్రెస్ కు 36 మంది, డీలక్స్ కు 29 మంది, సూపర్ లగ్జరీ బస్సుకు 26 మందికి అనుమతించడం జరుగుతుందని వివరించారు. దీనివలన ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నప్పటికీ

ప్రజారోగ్యం దృష్ట్యా ఈ ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

ప్రతీ బస్సు స్టేషన్ మరియు సీట్లను ఎప్పటికపుడు హైపోక్లోరెడ్ తో శుభ్రం చేయడం జరుగుతుందని

అన్నారు. 

శ్రీకాకుళం - విశాఖపట్నం మరియు శ్రీకాకుళం - పలాస ప్రాంతాలకు ప్రతీ అరగంటకు à°’à°• బస్సు, 

పాలకొండ - కొత్తూరు - శ్రీకాకుళం, టెక్కలి – పూండి - పలాస,

టెక్కలి – విశాఖపట్నం, శ్రీకాకుళం – బొబ్బిలి ప్రాంతాలకు ప్రతీ గంటకు à°’à°• బస్సు, 

టెక్కలి – పాతపట్నం - శ్రీకాకుళం ప్రాంతానికి ప్రతీ గంటన్నరకు à°’à°• బస్సు

చొప్పున ఏర్పాటుచేసామని చెప్పారు. 

అలాగే ఇచ్చాపురం – విశాఖపట్నం, మందస – విశాఖపట్నం, టెక్కలి – విశాఖపట్నం, పాలకొండ – విశాఖపట్నం తదితర ప్రాంతాలకు కూడా

బస్సులను ఏర్పాటుచేసామని తెలిపారు. ప్రతీ ఎక్స్ ప్రెస్ పాయింట్ వద్ద టికెట్ కౌంటర్లను ఏర్పాటుచేసామని ఆమె వివరించారు. ప్రయాణీకులు దీనిని గమనించి ప్రభుత్వ

నిబంధనలను పాటిస్తూ ప్రయాణం చేయాలని ఆమె ఆకాంక్షించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam