DNS Media | Latest News, Breaking News And Update In Telugu

26న ప్రైవేటు అర్చకుల అకౌంట్లో 5 వేలు జమ: వడ్డాది ఉదయ్

*ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సంయుక్త కార్యదర్శి ఉదయ్*

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 21, 2020 (డి ఎన్ ఎస్ ): కరోనా లాక్ డౌన్ వల్ల దేవాలయాల

మూసివేసి ఉపాధి లభించని ప్రైవేటు దేవాలయాల అర్చకులకు దేవాదాయ శాఖ ప్రకటించిన ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం ఈనెల 26న అర్హులైన అర్చకుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం

జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వడ్డాది ఉదయ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 31107

మంది అర్చకులను అర్హులుగా గుర్తించారని, రాష్ట్ర వ్యాప్తంగా 15 కోట్ల 50 లక్షల 85 వేల రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. 26న అర్చకులు అందరికీ

ఆర్థిక సహాయం చేయడానికి నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి, బ్రాహ్మణ

కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు కు ఉదయకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ లో పెండింగ్ లో ఉన్న భారతి స్కీం విద్యార్థులకు ఉపకార

వేతనాలు త్వరితగతిని అందజేయాలని ఉదయకుమార్ విజ్ఞప్తి చేశారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ పింఛన్ దారులకు వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా పింఛన్లు

అందజేయడానికి ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో పింఛన్ దారుల వివరాలను గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారని వారికి సహకరించాలని

కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam