DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తూగో జిల్లా సముద్ర తీరం లో వెండి నాణేల వెతుకులాట 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 21, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): తూర్పు గోదావరి జిల్లా  à°¯à±.కొత్తపల్లి మండలం కోనపాప పేట గ్రామంలో వెండి నాణేలు కలకలం

సృష్టించాయి. గత రెండురోజుల నుండి ఉమ్ పున్ తూఫాన్ కారణంగా ఎగసిపడే అలల తాకిడికి కోనపాపపేట సముద్ర తీరంలో ఉన్న కొన్ని ఇళ్లు కోతకు గురై సముద్రంలో కలిసిపోయాయి.

అందులో ఒక ఇంటి పునాది గోడ కూలటంతో కొన్ని వెండి నాణాలు, రూపాయి నాణెములు కూడా కనిపించాయి. మరికొన్ని సముద్రం లో కలిసిపోయాయి. రాత్రి సమయంలో ఈవిషయం తెలియటంతో

టార్చిలైట్స్ సహాయంతో వెండి నాణెములు వెతికేందుకు జనం అక్కడకు చేరుకున్నారు ఉదయం కూడా నాణెం లకోసం సముద్రంలో వేతుకులాట మోదలు పెట్టారు. ఎక్కువగానే వెండి

నాణేలు, రూపాయి నాణెంలు లభ్యమయినట్లు స్థానికులు చెబుతున్నారు. కాని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుంటారనే భయంతో అవి చూపించేందుకు ఎవరు ముందుకు రావడం

లేదు. గతంలో స్థానికంగా బొందు అమ్మోరియ్య, ఎల్లమ్మ అనే మత్స్యకార కుటుంబం ధనవంతులుగా ఇదే నివాసంలో ఉండె వారని, వారికి కోట్ల రూపాయల ఆస్తులు ఉండేవని వారికి

చెందిన ఇంటి గోడలో ఈ నాణెంలు దాచిపెట్టి ఉంటారేమో నని స్ధానికులు చెబుతున్నారు. దీనిపై పురావస్తు అధికారులు స్పందించి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇంకా మరెన్నో

పురాతన వస్తువులు దొరికే అవకాశం ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam