DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిఎస్పీ వేషంతో బురిడీ, తూగో జిల్లాలో భారీ గా వసూళ్లు 

*ఎస్సై సహకారం తో భారిగా నగదు  à°¦à°‚డుకున్న కేడి*

*కరోనా ఇంటెలీజెన్స్ ప్రత్యేక డీఎస్పీ అంటూ భారీ దోపిడీ* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో,

అమరావతి)*

అమరావతి, మే 21, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ) : లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేస్తుండటంలో పోలీసులంతా నిమగ్నమై ఉంటే . . . à°“ వ్యక్తి డీఎస్పీ వేషం వేసి భారీ మొత్తం నగదు వసూళ్లు

చేసేసాడు. ఇతనికి ఒక ఎస్ ఐ కూడా సహకరించడంతో విస్తృతంగా వ్యాపారం కొనసాగించేసారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నిందితున్ని పోలీసులు అదుపులోకి

తీసుకుని విచారిస్తున్నారు. 

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం మధురపూడికి చెందిన బత్తిన వెంకన్నబాబు అలియాస్ వెంకటేష్ / వెంకట్ (40) కరోనా

ఇంటెలీజెన్స్ ప్రత్యేక డీఎస్పీ అంటూ సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల వద్ద అక్రమంగా డబ్బులు తీసుకునేవాడు. సీతానగరం పీఎస్‌లో గతంలో ఎస్ఐగా పనిచేసిన

ఆనంద్ కుమార్ అండదండలతో వెంకట్ మరింతగా అక్రమాలకు తెగబడ్డాడు డీఎస్పీ అధికారినంటూ అందరినీ నమ్మించడంతో పాటు వివిధ షాపుల్లో విలువైన సామాగ్రిని డబ్బులు

చెల్లించకుండానే తీసుకునేవాడు.

à°ˆ క్రమంలో బాధితులు నుంచి ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. దీంతో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షీమోషీ బాజ్‌పేయ్ ఆదేశాలతో

పోలీసులు  à°¨à°¿à°‚దితుడిని పట్టుకున్నారు. బుధవారం అతడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన  à°¡à±€à°Žà°¸à±à°ªà±€ పీఎస్ఎన్ రావు కేసుకు సంబంధించిన వివరాలను

వెల్లడించారు.

చివరకు కటకటాలపాలు..

కాగా, రాజమహేంద్రవరంలోనే ఉంటున్న నిందితుడు వెంకన్న బాబు ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు అద్దె కార్లు నడుపుతుంటాడు.

అయితే, మరింత డబ్బును సంపాదించాలనే దురాశతో à°ˆ తరహా నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. నిందితుడిని రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు

తరలించినట్లు సీతానగరం ఇంఛార్జీ ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ ఆనంద్ కుమార్‌ను ఉన్నతాధికారులు ఇప్పటికే వీఆర్‌కు పంపించినట్లు

తెలిసింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam