DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముంబై నుండి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ : అమలాపురం ఆర్డీఓ

*ఇంటికి వెళ్లకుండా నేరుగా పరీక్షకు రావడం వచ్చిన ఇతనికి అభినందనలు*  

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 21, 2020 (డి ఎన్ ఎస్ ): తూర్పు గోదావరి

జిల్లా అమలాపురం సుర్యానగర్ కు చెందిన 23 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడం జరిగిందని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ గురువారం

à°’à°• ప్రకటన లో తెలిపారు.ఇతను  à°°à±†à°‚డు రోజుల క్రితం ముంబై నుండి  à°µà°šà±à°šà°¿ తనంతట తానుగా కరోనా వుందనే అనుమానం తో భట్లపాలెం బి.వి.సి. క్వారం టైన్ సెంటర్ కు రావడం తో

అతనికి ప్రాథమిక పరీక్ష( ట్రూ నాట్) చేయడం తో పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆర్.డి. ఓ తెలిపారు. అంతిమ పరీక్ష లో కూడా అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం తో

వెంటనే అతన్ని రాజమహేంద్రవరం జీ.ఎస్.ఎల్. కు తరలించడం జరిగిందని, ఆర్.డి. ఓ తెలిపారు. ఆవ్యక్తి తో పాటు వచ్చిన అతని స్నేహితులు ప్రైమరీ కాంటాక్ట్స్, మరియు సెకండరీ

కాంటాక్ట్స్ కలిపి మొత్తం 15 మందిని భట్లపాలెం బీవిసి క్వారం టైన్ కు తరలించి ఆర్.టీ.పి.సి.ఆర్. పరీక్ష నిర్వహించగా అందరికీ కరోనా నెగిటివ్ రావడం జరిగిందని ఆర్.డి. ఓ

తెలిపారు. ముంబై నుండి వచ్చిన వ్యక్తి అతని కుటుంబ శ్రేయస్సును, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఇంటికి వెళ్లకుండా నేరుగా క్వారం టైన్ సెంటర్ కు వెళ్లి

మనందరికీ స్ఫూర్తి గా నిలిచి నందుకు ఆర్.డి. ఓ అతనికి ధన్యవాదాలు తెలిపారు. ఇతన్ని స్ఫూర్తి గా తీసుకుని ఎవరైనా సరే కరోనా లక్షణాలు వున్నట్లు అనుమానం వుంటే

స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని  à°†à°°à±.à°¡à°¿. à°“ విజ్ఞప్తి చేశారు.
బండారు లంక లో ప్రస్తుతం వున్న  500 మీటర్లు కంటైన్ మెంట్ జోన్

పరిధి ని 200 మీటర్ల కు కుదించడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. ఈ 200 మీటర్ల పరిధిలో ప్రజలెవరూ లోపలికి గాని, బయటకు గాని వెళ్ళడానికి అనుమతి లేదని ఆర్.డి. ఓ తెలిపారు. అలాగే

షాపులు కూడా తెరవడానికి వీలు లేదని ఆర్.డి. ఓ హెచ్చరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam