DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వధార్ హోమ్ బాధిత మహిళలకు కమిషన్ అండగా నిలుస్తుంది

*రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి* 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 21, 2020 (డి ఎన్ ఎస్ ): తూర్పు గోదావరి జిల్లా

రాజమహేంద్రవరం లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బొమ్మూరు మహిళా ప్రాంగణం స్వధార్ హోమ్ బాధిత యువతులను గురువారం నాడు రాష్ట్ర మహిళా కమిషన్

సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి పరామర్శించారు. ఆమె కొద్దిసేపు బాధిత నలుగురు యువతులతో మాట్లాడి స్వధార్ హోమ్ లో జరిగిన విషయాలను స్వయంగా అడిగి

తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పరిస్థితిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ దృష్టికి తీసుకువెళ్లి వివరిస్తామని, బాధితులకు

ప్రస్తుతం ఐసిడిఎస్ నుండి ఒక్కొక్కరికి 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా

శిక్షించే విధంగా మహిళా కమిషన్ కృషి చేస్తుందన్నారు అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విలేఖరి భార్యను పరామర్శించారు.
 à°¬à±Šà°®à±à°®à±‚రు మహిళా ప్రాంగణం స్వధార్

హోమ్ నుండి తరలించిన యువతులను కందుకూరి వీరేశలింగం స్టేట్ హోమ్ నందు ఉన్న వారిని కమిషన్ సభ్యురాలు పరామర్శించారు. డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ డాక్టర్ కోమల,

బొమ్మూరు మహిళ ప్రాంగణం ఇంచార్జి సిహెచ్ వి నరసమ్మ రాజ్యలక్ష్మి వెంట ఉన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam