DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ down తర్వాత పూర్తి స్థాయి సిబ్బందితో కొత్తపేట ఐసిడిఎస్ ప్రాజెక్ట్

*రెడ్ జోన్ ప్రాంతమైన విధుల్లోకి సిబ్బంది రెడీ.* 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

కాకినాడ / విశాఖపట్నం, మే 21, 2020 (డి ఎన్ ఎస్ ): గత 53 రోజుల పాటు లాక్ డౌన్

బ్రేక్ డౌన్ తర్వాత వివిధ ప్రాంతాల్లో చిక్కుకు పోయిన సిబ్బంది తిరిగి పూర్తి స్థాయిలో విధుల్లోకి ప్రత్యక్షంగా రావడంతో తూర్పు గోదావరి జిల్లా లోని ప్రభుత్వ

కార్యాలయాలన్నీ యాధస్థితికి చేరుతున్నాయి. కొత్తపేట మండలం లోని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ( ఐ సి డి ఎస్) కార్యాలయం సహా, ఇతర కార్యాలయాలన్నీ పూర్తి స్థాయి

పనులకు సిద్ద పడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా చిన్నారులు, మహిళలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలన్నీ అమలు చెయ్యబడుతుంటాయి. అంగన్వాడీ కేంద్రాలు, మహిళ సంరక్షణ

పధకాలు తదితర నిర్వహణ చేపట్టేది ఈ ప్రాజెక్ట్ సిబ్బంది కావడం గమనార్హం.
 
 à°®à°¾à°°à±à°šà± 23 తర్వాత వివిధ ప్రాంతాల్లో చిక్కుకు పోయి ప్రధాన కార్యాలయం ఆదేశాల మేరకు

వివిధ ఆయా ప్రాంతాల నుంచే విధులను నిర్వహించే వారంతా గురువారం మాతృ కార్యాలయాలకు చేరుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయి సిబ్బందితో

విధులకు సిద్ధంగా ఉన్నాయి. ఇంత వరకూ గ్రామా వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పధకాల సేవలు పొందిన ప్రజలు, ఇక పై అధికార సిబ్బంది ద్వారా పూర్తి స్థాయి సేవలను

అందుకోనున్నారు. 
 à°—ురువారం నుంచి ప్రజా రవాణా సంస్థ కు చెందిన బస్సులు కూడా విధుల్లోకి రావడంతో జిల్లాలోని ఇతర ప్రాంతాలనుంచి కాక, మండలం లోని వారు కూడా

బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆటోల్లో సైతం కార్యాలయాలకు చేరుకుంటున్నారు. అయితే అమలాపురం ప్రాంతం రెడ్ జోన్ పరిధిలో ఉండడంతో ఆ పరిసర ప్రాంతాల్లోని

ఉద్యోగులు కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నారు. అయితే మధ్యాహ్నం నాటికి బస్సులు పరిమిత ట్రిప్ లను నడిపేందుకు సిద్ధం కావడంతో పరిస్థితి కుదుట పడింది. చాలా రోజుల

తర్వాత పూర్తి స్థాయి విధులకు సిద్ధం కావడంతో గురువారం తలెత్తిన సమస్యలు పరిష్కరించుకుని శుక్రవారం నుంచి యధావిధిగా సేవలు లభించనున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam