DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్న పరిశ్రమల బలోపేతానికి సీఎం జగన్‌ రూ. 1110 కోట్ల సాయం

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 22, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):  à°¸à±‚క్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌à°Žà°‚à°ˆ) à°² బలోపేతం కోసం ‘రీస్టార్ట్‌’ పేరిట à°“

కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా రెండు విడతలుగా రూ.1110 కోట్ల మేర సాయాన్ని ప్రకటించి ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ప్రభుత్వం

నుంచి చేయూతను అందించనున్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో చిన్న,మధ్య తరగతి పరిశ్రమల ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

నిర్వహించారు. à°ˆ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అందుకోసం రూ. 905 కోట్ల బకాయిలతో

పాటు రూ.187 కోట్ల స్థిర విద్యుత్‌ చార్జీల మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిర్వహణ మూల ధనం రుణాలకు రూ.200 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఎంఎస్‌ఎంఈలకు కేవలం 6 నుంచి 8 శాతం వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లలో 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచే చేయాలని నిర్ణయించారు. అలా చేసిన కొనుగోళ్లకు 45

రోజుల్లో చెల్లింపులు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమలకి విద్యుత్ డిమాండ్ ఛార్జీలను ప్రభుత్వం

రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న

ప్రోత్సాహక బకాయిలను విడుదల చేయడంపై ఆగ్రో ఇండస్ట్రీస్‌ ప్రతినిధి డివి రాజు ఆనందం వ్యక్తం చేశారు. ప్రోత్సాహక బకాయిలు విడుదల చేయడంతో పాటు విద్యుత్‌ డిమాండ్‌

ఛార్జీలు రద్దు చేయడంపై సీఎం వైఎస్‌ జగన్‌కు స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కృష్ణబాలాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam