DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నర్సీపట్నం డాక్టర్ కేసు లో హైకోర్టు లో వైసీపీ ప్రభుత్వానికి అడ్డుకట్ట.

*సుధాకర్ వ్యవహారంపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం.*

*విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని*

*8 వారాల్లోగా విచారణ, నివేదిక ఇవ్వాలని

ఆదేశం.*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 22, 2020 (డి ఎన్ ఎస్ ): విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నం ఆసుపత్రిలో వైద్యుడు డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు

అత్యంత అమానుషంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆయన బట్టలు విప్పించి, చేతులు వెనక్కి కట్టి, దుర్భాషలాడుతూ, కొట్టారు. అంతేకాదు ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని

కేజీహెచ్ వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో... ఆయనను మానసిక వైద్యశాలకు తరలించారు. సుధాకర్ అంశం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై

విపక్షాలు మండిపడ్డాయి. మాస్కులు లేవని ప్రశ్నించిన డాక్టర్ ను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం... ఆయనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విపక్ష నేతలు

మండిపడ్డారు. మరోవైపు, డాక్టర్ సుధాకర్ ఘటనపై ఏపీ హైకోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి. 

మేజిస్ట్రేట్ ఇచ్చిన నివేదికలో సుధాకర్ వంటిపై గాయాలున్నాయని, అయితే

పోలీసులు ఇచ్చిన నివేదికలో ఎందుకు లేవు అనే ప్రశ్నకు సమాధానం లేదు. 

పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. డాక్టర్ పై జరిగిన దాడిని హైకోర్టు

తీవ్రంగా పరిగణించింది. ఆయనపై దాడి చేసిన పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశించింది. పోలీసులపై సీబీఐ వెంటనే కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ

చేసింది. 8 వారాల్లోగా నివేదికను అందించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam