DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎం.ఎస్.ఎం.ఇల రీస్టార్ట్ తో పారిశ్రామిక అభ్యున్నతి: మంత్రి ధర్మాన 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 22, 2020 (డిఎన్ఎస్ ): ఎం.ఎస్.ఎం.ఇలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో ఉపశమనం

లభిస్తుంది రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు. ఎం.ఎస్.ఎం.ఇ లకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం రీ స్టార్ట్ కార్యక్రమంను శుక్ర వారం

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం శ్రీకాకుళం లో మీడియాతో మంత్రి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని

విధంగా రాష్ట్ర ముఖ్య మంత్రి రీ స్టార్ట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఎం.ఎస్.ఎం.ఇలకు పునరుత్తేజం కలిగించారని చెప్పారు. రాష్ట్రంలో రీ స్టార్ట్ ప్యాకేజీ

క్రింద రూ.1110 కోట్లు ఎం.ఎస్.ఎం.ఇలకు ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. ఎం.ఎస్.ఎం.ఇల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకు పూర్తి సహాయ సహకారాలు

అందిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రూ.827.50 కోట్ల బకాయిలు పెట్టగా దానిని కూడా ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. లాక్ డౌన్ కాలంలో మూడు నెలల స్ధిర

విద్యుత్ బిల్లులు రూ.187.80 కోట్లను మాఫీ చేస్తున్నట్లు ముఖ్య మంత్రి ప్రకటించారని తెలిపారు. నిర్వహణ మూలధనానికి రూ.2 వందల కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడం దాంతో 6

నుండి 8 శాతం వడ్డీకే రుణాలు అందించుటకు చర్యలు చేపట్టడం ముదావహమన్నారు. ప్రభుత్వ విభాగాలు కొనుగోళు చేసే వస్తు సేవల్లో కనీసం 25 శాతం ఎం.ఎస్.ఎం.ఇల నుండి కొనుగోళు

చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం అందులో 4 శాతం ఎస్.సి, ఎస్.టి., 3 శాతం మహిళా యాజమాన్యాలు నిర్వహిస్తున్న సంస్ధల నుండి కొనుగోళు చేయాలని పేర్కొనడం ఎం.ఎస్.ఎం.ఇల

ప్రోత్సాహానికి ప్రభుత్వం చూపిస్తున్న చొరవ తెలుస్తుందని అన్నారు. టెండరు సెట్ల ఫీజు, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, కనీస టర్నోవర్ నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వడంతో

ఎం.ఎస్.ఎం.ఇలకు పురోగతికి ప్రభుత్వం బాటలు వేస్తుందని చెప్పారు. ఎం.ఎస్.ఎం.ఇ యాజమాన్యాలు రాష్ట్ర ముఖ్య మంత్రి ఎంతో చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాలను

సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా నుండి వలసల నివారణకు దీనిని ఉపయోగించుకుని మరింత మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు కూడా

ముందుకు రావాలని కోరారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎం.ఎస్.ఎం.ఇలు ఎంతో తోడ్పాటును అందిస్తాయని చెప్పారు. బి.టెక్ ఇతర సాంకేతకి విద్యను

అభ్యసించిన విద్యార్ధులు అనేక మంది ఉన్నారని ప్రభుత్వం అందించే చేయూతతో పరిశ్రమలు పెట్టవచ్చని, ఔత్సాహికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam