DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు, ఏ శిక్ష కైనా రెడీ పవన్ కు బండారు హెచ్చరిక

వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు, ఏ శిక్ష కైనా రెడీ పవన్ కు బండారు హెచ్చరిక 

విశాఖపట్నం, జులై 6 , 2018 (DNS  Online ) : వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, లేనిపక్షంలో భారీ

మూల్యం చెల్లించాల్సి వస్తుందని పెందుర్తి శాసన సభ్యుడు బండారు సత్యనారాయణ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను హెచ్చరించారు. పెందుర్తి పర్యటనలో పవన్ కళ్యాణ్

తనపై, తన కుమారుడి పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయన క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. 
ఎవరో ఇచ్చిన రాతలపై కూతలు పెట్టడం అనుచితమన్నారు. సబ్బవరం పరిధిలో పెట్రోలియం

యూనివర్సిటీకి రెండొందల ఎకరాలు రైతులకు పరిహారం ఇచ్చి సేకరించారని, నేను నా కుమారుడూ కలిసి మూడువేల ఎకరాలు దోచామని పవన్ ఆరోపించారన్నారు. మీరు అధ్యయనం

చేయకుండా ఆరోపణలు చేయటం ఏమిటి అని ప్రశ్నించారు. ఫార్మా సిటీ లో కాలుష్య పరిశ్రమలు మేము తెచ్చినవి కాదని, గతంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యవం లోనే ఫార్మా

సిటీ వచ్చిందని, దానిపై కాలుష్యానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేశామని గుర్తు చేశారు.  à°®à±‡à°®à± చేసిన ఉద్యమం ఫలితంగానే నేడు తాడి గ్రామం తరలింపునకు

సిద్దమైందన్నారు. 
ముదపాక గ్రామ భూములకు తనకూ ఏ విధమైన సంబంధం లేదని, గ్రామ ప్రజలు వద్దనగానే సిఎం చంద్రబాబు అక్కడ లాండు పూలింగ్ ఆపేశారన్నారు.

ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.  à°¨à°¾ మీద ఒక్క ఆరోపణ లేదు. వందకోట్లు కూడబెట్టానంటున్నారు. ఆస్తి అమ్ముకున్నా

గానీ కూడబెట్టలేదు. ఎమ్మెల్యేగా ఒక్క రూపాయి అధికంగా సంపాదించినా ఏ శిక్షకైనా సిద్ధమని బండారు సవాల్ విసిరారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam