DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒక్కరోజే 11 కరోనా పాజిటివ్,  తూగో జిల్లాలో కలకలం

*పాజిటివ్ మృతును నుంచి మరికొందరికి . ..* 

*ఆందోళనలో జిల్లా వాసులు, అధికారులు అప్రమత్తం.* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 24, 2020 (డి ఎన్ ఎస్ ):

ఒక్కరోజులోనే 11 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కావడం తూర్పు గోదావరి జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు, అధికారులు అప్రమత్తం అయ్యారు. వివరాల్లోకి వెళితే.

 à°¤à±‚ర్పు గోదావరి జిల్లా లో ఇంతవరకూ à°ˆ ప్రభావమే చూపని ప్రాంతాల్లో ఏకంగా 11 కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.  à°µà°¾à°°à°‚ రోజులుగా వరుసపెట్టి

ఎక్కువ సంఖ్యలో పాజిటివ్‌లు నిర్ధారణ అవుతుండడంతో ఆయా ప్రాంతాల్లో కలకలం రేగుతోంది. పైగా ఇప్పుడు వస్తున్న కేసులన్నీ కొత్త ప్రాంతాలే కావడంతో

తగ్గిపోయాయనుకున్న రెడ్‌జోన్‌లను మళ్లీ పెంచుతున్నాయి. 
తాజాగా జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే ఏకంగా పదకొండు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో

ఎనిమిది మందికి కొవిడ్‌తో గురువారం మృతి చెందిన వ్యక్తి ద్వారా వ్యాపించినట్టు వైద్యశాఖ నిర్ధారణకు వచ్చింది. ఇందులో ఇద్దరు మహిళలు, ఆరుగురు పురుషులుండగా, సగం

మంది వయస్సు యాభై ఏళ్లపైనే. పైగా వీరంతా సదరు మృతుడి రక్త సంబంధీకులు, దగ్గరి బంధువులే. జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన గొల్లల మామిడాడ ప్రాంతానికి

చెందిన à°’à°• వ్యక్తి  à°°à°¾à°®à°šà°‚ద్రపురం లో జరిగిన à°’à°• వివాహం లో పాల్గొన్న వ్యక్తి ద్వారా బంధువులకు, ఇతరులకు సోకడం à°ˆ కేసులు వెలుగులోకి వచ్చాయి. 

పెళ్లి తర్వాత ఆ

వ్యక్తి అనపర్తికి వెళ్లి కంటి పరీక్ష చేయించుకున్నాడు. తదుపరి, బిక్కవోలులోని మేనకోడలు ఇంటికి వెళ్లాడు. ఇతనికి అనారోగ్యం కారణం గా మృతి చెందినట్టు

తెలుస్తోంది. ఇతని ద్వారా మరో ఎనిమిది మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వీరందరికి  à°‡à°¤à°¨à°¿ ద్వారానే వైరస్‌ వ్యాపించినట్టు అధికారులు గుర్తించారు. బాధితుల్లో

ఇద్దరు బిక్కవోలు వాసులు. పాజిటివ్ à°—à°¾ తేలిన వారందరినీ ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. ఊహించని à°ˆ పరిణామం తో అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లా వైద్య అధికారులు,

పొలిసు ఉన్నతాధికారులు బిక్కవోలు, మామిడాడ ప్రాంతాలకు చేరుకొని ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి, స్థానిక పారిశుధ్య కార్మిక విభాగాన్ని రంగం లోకి దించారు.

మొత్తం గ్రామంలోని అన్ని ప్రాంతాల్లోనూ శానిటైజేషన్ పనులతో పాటు, బ్లీచింగ్ చల్లడం, హైపో ద్రావకాన్ని కొట్టడంతో గ్రామస్తుల్లో ఆందోళనలను తగ్గించే ప్రయత్నం

చేసారు. 

బొమ్మూరులో మరో ముగ్గురికి...

బొమ్మురు క్వారంటైన్‌లో ఉంటున్న ముగ్గురికి శుక్రవారం పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరు ముగ్గురు 30ఏళ్లలోపు

యువకులే. ఇందులో ఇద్దరు మూడు రోజుల కిందట విదేశాల నుంచి విశాఖ విమానాశ్రయంలో దిగి బొమ్మూరు క్వారంటైన్‌కు వచ్చారు. వీరికి పాజిటివ్‌à°—à°¾ తేలింది. అటు ఇతర

ప్రాంతాలకు వలస వెళ్లి వచ్చిన మరో 25 ఏళ్ల యువకుడికి కూడా పాజిటివ్‌à°—à°¾ నిర్ధారణ అయింది. రాజ మహేంద్రవరం నగరంలోని సీతంపేట ప్రాంతానికి చెందిన యువకుడిగా ఇతడిని

గుర్తించారు. మరోపక్క గురువారం కొవిడ్‌తో మృతిచెందిన వ్యక్తికి వైద్యసేవలందించిన 14 మంది వైద్యులను కాకినాడలోని à°“ ప్రైవేట్‌ హోటల్‌లో వేర్వేరు గదులు

బుక్‌చేసి అందులో ఉంచారు. వీరికి ఈనెల 25à°¨ శ్వాబ్‌ టెస్ట్‌లు చేయనున్నారు. కాగా జిల్లాలో 11 కేసులు ఒకేరోజు నమోదవడం ఇదే తొలిసారి. గతనెల 18à°¨ జిల్లాలో ఒకేరోజు ఆరు

కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. à°† తర్వాత అంతకుమించిన సంఖ్యలో శుక్రవారం కేసులు పెరిగాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam