DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాక్ డౌన్ సడలించారు, బిగించిన బారికేడ్లు వదిలేశారు 

అక్కయ్యపాలెం ఇంకా రెడ్ జోన్ లోనే ఉందా: స్థానికులు

అధికారులు జవాబు చెప్పరు, పోలీసులు రోడ్డుపై కనపడరు  

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,

 à°µà°¿à°¶à°¾à°– పట్నం) . . .

విశాఖ పట్నం, మే 25, 2020 (డిఎన్ఎస్ ): దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించిన విశాఖపట్నం లోని అక్కయ్యపాలెం మాత్రం బారికేడ్ల బంధంలో

ఉండిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా నిబంధలను సడలించారు. విశాఖపట్నం లోని అక్కయ్యపాలెం ప్రాంతంలో మహారాణి పార్లర్ ప్రాంతంలో మార్చి నెలలో బిగించిన బారికేడ్లు

మాత్రం తొలగించడకుండా వదిలేసారు. దీంతో స్థానికులు ఇంకా నేటికీ జైలు మాదిరి జీవితం గడుపుతున్నామంటూ మండిపడుతున్నారు. నగరమంతా లాక్ డౌన్ తొలగించినా మహారాణి

పార్లర్ నుంచి దొండపర్తి వైపు వేళ్ళ మార్గంలో సందుల్లో అప్పుడెప్పుడో బిగించిన ఇనుప బారికేడ్లు ఇప్పడికే తొలగించకుండా వదిలేసారు. దీనిపై స్థానికులు

 à°—్రేటార్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) అధికారులు ను ప్రశ్నించగా సమాధానం చెప్పే నాధుడే లేకుండాపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే à°ˆ

బారికేడ్లు బిగించిన పొలిసు అధికారులను ప్రశ్నించే ప్రయత్నం చేసినా వాళ్ళు సైతం ఈ ప్రాంతంలో కనిపించడం లేదు. కానిస్టేబుల్ స్థాయి వ్యక్తులు కనపడితే వారిచే

సమాధానం ఒక్కటే. . . మా పై అధికారులు చెప్పారు అందుకే బారికేడ్లు బిగించాము. 

ప్రధాన రహదారుల్లోని మహారాణి పార్లర్ , 80 ఫీట్ రోడ్, వివేకానంద ఆసుపత్రి తదితర

వీధుల్లోని బారికేడ్లు అన్నీ తొలగించారు. ప్రక్కనే ఉన్న వీధుల్లో మాత్రం తొలగించకుండా పోలీసులు వెళ్లిపోయారని స్థానికులు తెలియచేస్తున్నారు. 

à°ˆ

బారికేడ్ల బంధంలో చిక్కుకు పోయిన ప్రాంతాల్లో మీడియా ప్రతినిధులు కూడా నివాసం ఉండడం గమనార్హం. పైగా అధికార పార్టీకి చెందిన మీడియా సలహాదారులు కూడా ఈ బారికేడ్ల

బంధంలో ఉండిపోయారు. 

ఇప్పడికైనా జివిఎంసి కమిషనర్ స్పందించి, ఈ ప్రాంతం అసలు రెడ్ జోన్ లో ఉందా లేదా అనే విషయాన్నీ చెప్పాలని, లేని పక్షంలో ఈ ఇనుప

బంధాలనుంచి అక్కయ్య పాలెం వాసులను విముక్తుల్ని చెయ్యాలని కోరుతున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam