DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ సిబ్బంది ఆరోగ్యం కోసం ఐటీసీ 2500 లీటర్ల హెల్త్ డ్రింక్ పంపిణీ

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 27, 2020 (డి ఎన్ ఎస్ ): కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మార్చి 23 నుంచి అహర్నిశలు ప్రజా సంక్షేమం కొరకు పాటుపడుతున్న

పోలీసు అధికారులు మరియు వారి కుటుంబాల వారి ఆరోగ్య పరి రక్షణ కొరకు ఐటిసి కంపెనీ ప్రతినిధులు 2500 లీటర్ల హెల్త్ డ్రింక్ ను అందించారు. బుధవారం ఏలూరు రేంజ్ ఏలూరు

డిఐజి కె.వి. మోహన్ రావు ద్వారా పోలీస్ అధికారులకు అందరికీ పంపిణీ చేసారు. దీని ఖరీదు 2 లక్షల 50 వేల రూపాయలకు పైగానే ఉంటుంది. 

ఈ సందర్భంగా కంపెనీ బ్రాంచ్

మేనేజర్ మాట్లాడుతూ 24/7 పోలీస్ అధికారులు అందరూ ఫ్రంట్ వారియర్స్ గా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అహర్నిశలు కష్టపడి ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన

కల్పిస్తున్న పోలీస్ బృందాలకు తమ వంతు కృతజ్ఞతగా సహకారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాలలో బందోబస్తు నిర్వహిస్తూ ప్రజలకు ఎంతో సేవ

చేసినటువంటి పోలీస్ వ్యవస్థకు వారి వంతు సహకారాలు అందించే నిమిత్తం à°—à°¾ à°ˆ చిరు ప్రయత్నం చేసినట్లుగా తెలియజేసినారు. 

ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ డీఐజీ

మాట్లాడుతూ పోలీసు యొక్క సంక్షేమం గురించి ఆలోచించి వారు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని భావించి హెల్త్ డ్రింక్ ను సరఫరా చేసినటువంటి ఐటిసి

యాజమాన్యానికి మరియు వారి యొక్క అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేశారు.. 

ఈ కార్యక్రమం లో ఐటీసీ కంపెనీ బెంగళూరు విశాఖపట్నం ఏరియా బ్రాంచ్ మేనేజర్

జి రమణ మూర్తి, à°‡ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఎన్.విజయ, అసిస్టెంట్ ఏరియా మేనేజర్ à°Žà°‚. పవన్ బాబు, ఏరియా ఎక్జిక్యూటివ్  à°¸à±à°§à±€à°°à± బాబులు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam