DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి ఆస్తుల రక్షణకై స్వామిజి, భక్తులతో కమిటీ ఏర్పాటు చేస్తాం 

*ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు కమిటీ ఏర్పాటు* 
 
*కమిటీలో పీఠాధిపతులు, భక్తులకు అగ్రభాగం,* 

టిటిడి ట్రస్ట్ బోర్డు నిర్ణయాలు చైర్మన్ వై వి

సుబ్బారెడ్డి వెల్లడి: 

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 28, 2020 (డి ఎన్ ఎస్ ): తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు, కానుకలు, విక్రయించకూడదని టిటిడి

పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం జరిగిన పాలక మండలి అనంతరం అయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన

మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న టిటిడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఒక నూతన విధానాన్ని తీసుకువచ్చేందుకు కమిటీని నియమిస్తున్నాం అన్నారు. ఆ

కమిటీలో పీఠాధిపతులు, భక్తులకు సభ్యులుగా ఉంటారు..

గత పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను మా పాలకమండలి పై రుద్దుతూ బురదజల్లిన వారిపై సమగ్రవిచారణ జరిపి

చట్టపరమైన చర్యలు తీసుకునెందుకు ప్రభుత్వాన్నీ కోరాలని నిర్ణయం తీసుకున్నాం...

తిరుమల లో అతిధి గృహం కేటాయింపుల్లో పారదర్శకత ఉంటుంది...పాత అతిధి గృహాలు

పునర్నిర్మించేందుకు మాత్రమే అనుమతిస్తాం....

డోనేషన్ విధానంలో నూతన విధానాన్ని రూపొందించాలని టిటిడి ఈఓ ని కోరుతున్నాం...

టీటీడీ ఆధ్వర్యంలో త్వరలో

చిన్న పిల్లలు ఆసుపత్రిని నిర్మిస్తాం..

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ ముగిసిన అనంతరం శ్రీవారి దర్శనాల విషయం పై నిర్ణయం తీసుకుంటాం అని

తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam