DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోర్టు తీర్పు తో ప్రజాస్వామ్యానికి ఊపిరి వచ్చింది: పవన్

ఎన్నికల కమిషనర్ తొలగింపు ఆర్డినెన్స్ రద్దు పై జనసేనాని

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

విశాఖపట్నం, మే 29, 2020 (డి ఎన్ ఎస్ ): రాష్ట్ర ఎన్నికల

కమిషనర్ తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరి

పోసిందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం వెలువరించిన తీర్పు తో భారతీయ ప్రజాస్వామ్యం ఎంత పటిష్టంగా ఉందొ తెలుస్తోందన్నారు. ఈ

తీర్పు పై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని విడుదల చేసారు. అధికార పార్టీకి అనుకూలంగా లేనందున వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల కమిషనర్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తక్షణం విధుల్లో నుంచి తొలగిస్తూ ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. తదుపరి తమిళనాడుకు చెందిన కానగరాజ్ ను ఆ స్థానంలో కూర్చోబెట్టింది.

దీంతో పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం à°ˆ తీర్పు వెలువరించింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam