DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల కమిషనర్ గా నిష్పక్షపాతంగానే సేవలు అందిస్తా: రమేష్

*హైకోర్టు తీర్పు తో తిరిగి పదవి చేపట్టిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌*

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 29, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): శుక్రవారం  à°à°ªà±€

హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌à°—à°¾ మళ్లీ à°† పదవిలో కొనసాగుతున్నట్టు నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. à°ˆ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన తానూ

కొనసాగుతున్నట్టు అధికారికంగా ప్రకటన విడుదల చేస్తూ, అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు. గతంలో ఈయనను అర్ధాంతరం గా తొలగిస్తూ ఆర్డినెన్స్

జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ పలువురు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని తగ్గిస్తూ తీసుకొచ్చిన

ఆర్డినెన్స్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేస్తూ తన తుది తీర్పుని విడుదల చేసింది. à°—à°¤ ఆర్డినెన్స్ ను రద్దు చేసింది. అనంతరం రమేష్ కుమార్ తిరిగి తన విధుల్లో

కొనసాగుతున్నట్టు ప్రకటించారు. 

శుక్రవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న నిమ్మగడ్డ

రెండ్రోజుల్లో విజయవాడ వెళ్లనున్నారు. కాగా à°ˆ తీర్పుతో à°—à°¤ కొన్ని రోజులుగా మూతపడ్డ ఏపీఎస్‌ఈసీ కార్యాలయం తెరుచుకోనుంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించిన

తర్వాత ఏపీ ఎస్‌ఈసీ కార్యాలయానికి జీఏడీ సీల్‌ వేసింది. అయితే సోమవారం ఆఫీస్ తెరుచుకోనుంది.  à°¤à±€à°°à±à°ªà± అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే నిష్పాక్షికంగా

బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. అన్నిరాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకొని.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. వ్యక్తులు కాదు.. రాజ్యాంగ

సంస్థలు, విలువలు శాశ్వతమని రమేశ్ పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని ఆయన అన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మార్పు

వ్యవహారంపై హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ

ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. గతంలో మాదిరిగా నిష్పక్షపాతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే

సమావేశం ఏర్పాటు చేస్తానని వివరించారు. వ్యక్తులు శాశ్వతంగా ఉండరని,  à°°à°¾à°œà±à°¯à°¾à°‚à°— సంస్థలు, వాటి విలువలు చిరస్థాయిగా ఉంటాయని రమేశ్‌ కుమార్‌ అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam