DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్వారంటైన్ కేంద్రాల్లో శానిటైజర్లు తప్పక ఇవ్వాలి

*జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జయలక్ష్మి సూచన* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, మే 29, 2020 (డిఎన్ఎస్ ): à°°à°¾à°·à±à°Ÿà±à°°

అత్యున్నత ఆదేశాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలోని తామరాపల్లి, నరసన్న పేట లోని క్వారంటైన్ కేంద్రాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. జయలక్ష్మి

సందర్శించారు. శుక్రవారం ఈ కేంద్రాల్లో పర్యటించి, ఇక్కడ ఆశ్రయం పొందుతున్న తమిళనాడు కు చెందిన 37 మంది వలస కార్మికులతో మాట్లాడి, వసతి, ఆహార సదుపాయాలపై వివరాలను

తెలుసుకున్నారు. అనంతరం క్వారంటైన్ కేంద్రాల నిర్వాహకులను అడిగి సదుపాయాలను ఆరా తీశారు. వీరికి అందిస్తున్న భోజన, మంచినీటి సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసారు.

కేంద్రాల్లోని ఆశ్రయం పొందిన వారికీ తప్పని సరిగా శానిటైజర్లను అందించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వెంట మండల రెవిన్యూ

అధికారి, నరసన్న పేట విఆర్ à°“, పోలీస్ ఎస్ ఐ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam