DNS Media | Latest News, Breaking News And Update In Telugu

8 న రామతీర్ధాల ఆలయం లో శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం

విశాఖపట్నం, జులై 6 . 2018 (DNS Online ): అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రామతీర్ధాలు పుణ్యక్షేత్రం లో à°ˆ నెల 8 à°¨ శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషే మహోత్సవం అత్యంత వైభవంగా జరపనున్నట్టు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాలయ నిర్వహణ సంస్థ ( sita ) సంచాలకులు, చిలకపాటి విజయరాఘవాచార్యులు తెలియచేసారు. శ్రీ విలంబి నామ సంవత్సరం నిజ జ్యేష్ఠా మాస బహుళ దశమి భరణి

నక్షత్ర కన్య లగ్నం రోజు ఆదివారం జులై 8 న విజయనగరం జిల్లా రామతీర్ధాలు ల్లో వెలసిన శ్రీరామ స్వామీ దేవస్థానం లో ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ

అత్యంత వైభవంగా ఈ సామ్రాజ్య మహోత్సవం నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమం తమ మాతృమూర్తి చిలకపాటి లక్ష్మీకాంతమ్మ మంగళశాసనములతో శ్రీ పాంచరాత్రాగమ

విధానం లో జరుగుతుందన్నారు. ఉదయం కందాల రాజగోపాలం స్వామి, గొడవర్తి కూర్మచార్యుల చే సేవాకాలం తో ఉత్సవం మొదలవుతుందన్నారు. అనంతరం శ్రీ సంక్షేప రామాయణ హవనం (

రంగసాయి రామాచార్య స్వామి చే ), శ్రీ గాయత్రీ రామాయణ హవనం ( గొడవర్తి నర్సింహాచార్య స్వామి చే), శ్రీ రామతారక మంత్రం హవనం ( తిరుమల రంగనాధ అయ్యవార్లంగార్లు స్వామి చే)

శాస్త్రోక్తంగా ఆచరించబడుతుందని, అనంతరం ఉదయం  
10 గంటలకు  à°¶à±à°°à±€ సీతారామ కల్యాణ మహోత్సవం ( శ్రీభాష్యం శ్రీనివాసాచార్య స్వామి, గుడిమెళ్ళ కూర్మనాథ స్వామి, యు వి

సోమయాజులు స్వామి, గొడవర్తి శేషావతారం స్వామి ల అద్భుత వ్యాఖ్యానం తో), తదుపరి 11 :30 గంటలకు శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవం ( శ్రీభాష్యం శ్రీనివాసాచార్య

స్వాము, కందాల రాజగోపాలాచార్య స్వామి, గుడిమెళ్ళ కూర్మనాథ స్వామీ ల చే వ్యాఖ్యానం ) నిర్వహించబడుతుందని తెలిపారు. మధ్యజనం నుంచి శ్రీరామాయణ పథాన, శ్రావణ, అనుష్టాన

ప్రయోజనాలను తిరుమల రంగనాధ అయ్యవార్లంగార్లు, చిలకపాటి విజయరాఘవాచార్య స్వామి లచే వ్యాఖ్యాన పూర్వక వివరణ ఉంటుందని తెలిపారు. అనంతరం ఈ మహోత్సవానికి విచ్చేసే

భక్తులందరికీ తదీయారాధన, జారుతుందని వివరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam