DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రమేష్ ను కొనసాగాలా అనే తీర్పులో స్పష్టతకై సుప్రీం కు వెళ్తున్నాం:ఏజీ శ్రీరామ్

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి, మే 30, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ à°—à°¾  à°¨à°¿à°®à±à°®à°—డ్డ రమేష్ కుమార్ ను తిరిగి కొనసాగమని హైకోర్టు నేరుగా

ఎక్కడా చెప్పలేదని ఆంధ్ర ప్రదేశ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన పలు అంశాలను వెల్లడించారు. సాధారణంగా ప్రభుత్వ

న్యాయనిపుణులు ఎప్పుడూ మీడియా ముందుకు రారని, కానీ ఈ అంశంలో పలు రాజ్యాంగ సంబంధిత అంశాలు ముడిపడి ఉన్నందున హైకోర్టు తీర్పుతో కూడినందున మీడియా ముందుకు

రావాల్సివచ్చిందని తెలిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం తనంతట తానే బాధ్యతలు స్వీకరించినట్లుగా సర్క్యూలర్ విడుదల చేశారన్నారు. అయితే తాము

సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేశాం అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైకోర్టు జడ్జిమెంట్ కాపీ

వచ్చిందని, అయితే తానూ కొనసాగుతున్నట్టు రమేష్ కుమార్ రాష్ట్ర, జిల్లా అధికారులకు ఒక సర్కులర్ జారీ చేశారన్నారు. విజయవాడ కార్యాలయం నుంచి సర్క్యూలర్ విడుదల చేసి..

హైదరాబాద్‌లోని తన ఇంటికి వాహనాలు పంపించాలన్నారు. సుప్రీం కోర్టు కేసును పరిష్కరించే వరకూ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా కోరాం అన్నారు. 

రాష్ట్ర

ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదు అంటే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా à°ˆ నిబంధనే వర్తిస్తుంది.  à°…లాంటప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను

ప్రభుత్వం ఎలా నియమిస్తుందన్నారు. రమేష్ కుమార్ ను కూడా అప్పటి సీఎం చంద్రబాబు సలహా మేరకే నియమించారని తెలిపారు. గవర్నర్ నిర్ణయంలో మంత్రి మండలి సలహా అవసరం

లేదంటే.. అప్పటి సీఎం చంద్రబాబు ఇచ్చిన సలహా కూడా చెల్లదు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం కూడా చెల్లదన్నారు. హైకోర్టు తీర్పులో కాలవ్యవధి స్పష్టంగా

చెప్పకుంటే.. రెండు నెలల కాలవ్యవధి ఉంటుంది  
హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam