DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో ఎంపీ, మంత్రులు అలాగే ఉంటె. . .ప్రజలు ఇలాగె ఉంటారు 

*కనీస దూరం రూలు ప్రజలకేనా ప్రజా ప్రతినిధులకు అక్కరలేదా ?*

*విశాఖ లో ఎంపీ, మంత్రుల సభల్లో కానరాని కనీస దూరం* 

*నిబంధనలకు భాద్యత కల్గిన పెద్దలే

తిలోదకాలు ఇచ్చేశారా? . . .*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం,  à°œà±‚న్  01, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అనే

లక్ష్యంతో భారత కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మీటరు దూరం పాటించాలి అని నిబంధన విధించిన విషయం తెలిసిందే. దీన్ని అలవాటు చేసేందుకు గత రెండున్నర

నెలలుగా లాక్ డౌన్ విధించి మరీ ప్రజలు విచ్చలవిడిగా తిరగకుండా కట్టడి చేసింది. అయితే ప్రస్తుతం ప్రజలకు కొంత వెసులుబాటు ఇచ్చి, కనీస దూరం పాటించాలని

చెప్పింది. 

పార్టీ కార్యాలయం లో ప్రజా ప్రతినిధులు ఇలాగా . . . . 

అయితే ఈ కనీస దూరం నిబంధనలు కేవలం ప్రజలకు మాత్రమేనని, తమకు వర్తించవు అనే రీతిలో

విశాఖపట్నం లోని ప్రజా ప్రతినిధులు భావిస్తున్నట్టుగానే కనపడుతోంది. వీళ్ళు ప్రతి రోజూ కనీసం నాలుగైదు సభల్లో పాల్గొనడం, సమావేశాల్లో పాల్గొనడం వంటివి

చేస్తున్నారు. వీరు పాల్గొనే ఏ సభలోనూ కనీస దూరం ఎవ్వరూ పాటించడం లేదు. పైగా కొన్ని సభల్లో సాక్షాత్తు జిల్లా అధికారులే పాల్గొనడం గమనార్హం. ఇటీవల విశాఖ నగర

పార్టీ కార్యాలయం లో జరిగిన అధికార పార్టీ ఏడాది పూర్తి వేడుకల్లో ఏకంగా డజన్ల సంఖ్యలో పార్టీ నేతలు, మహిళలు, కార్యకర్తలూ పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిధులుగా

విశాఖ లోక్ సభ సభ్యులు ఎం వివి సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు హాజరవడం గమనార్హం. వీరు కూర్చున్న వేదికపై కనీస దూరం

ఏమాత్రం లేక పోగా కనీసం మిల్లి మీటర్ దూరం లేకపోవడం శోచనీయం. మహిళా సంఘాల ఆధ్వర్యవం లో జరిగిన వేడుకల్లోనైతే ఏకంగా జాతర దృశ్యమే కనిపించింది. 

ఏడాది పాలనా

పూర్తి వేడుకల్లో కనీస దూరం పాటించి నిర్వహించి ఉంటె. . . అందరికీ మంచి సందేశాన్ని ఇచ్చినట్టు అయ్యేది. అయితే వీళ్ళు ఆ అంశంపై ఏమాత్రం దృష్టి పెట్టక పోవడం కాదు

శోచనీయం. 

ఇప్పడికే ఎమ్మెల్యే లను నోటీసులు:. . .

కనీస దూరం పాటించకపోవడం, లాక్ డౌన్ నిబంధనలను పాటించని కారణంగా అధికార పార్టీకి చెందిన ఐదుగురు

ఎమ్మెల్యే లు, ఇతర ప్రజా ప్రతినిధులకు న్యాయస్థానం నుంచి నోటీసులు అందిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని జరుగుతున్నాభాద్యతాయుత హోదాల్లో ఉన్నవిశాఖ నగరంలోని ఎంపీ,

మంత్రులు నిబంధనలు తుంగలోకి తొక్కడం గమనార్హం. అధికారం లో ఉన్నాం కదా, మనం పాటించనవసరం లేదు అనే భావన లో ఉన్నారా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

  

రైతు బజార్ లో ప్రజలు ఇలాగ. . . 

పాలకులే ఇలాగ నిబంధనలకు తిలోదకాలిచేస్తే. . .వీళ్ళని అనుకరిస్తున్న ప్రజలు కనీస దూరం పాటిస్తారు అనుకోవడం అతిశయోక్తే

అవుతుంది. లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా అమలు లో ఉన్ననాడే రైతు బజార్లలో జనం కనీస దూరం పాటించాలి అనే విషయమే పట్టించుకోకుండా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది

లాక్ డౌన్ కు పూర్తిగా వెసులు బాటు ఇచ్చిన తర్వాత కనీస దూరం పాటిస్తారని ఎలా అనుకోగలం. 
హెచ్ బి కోలనీ లో కొత్తగా పెట్టిన రైతు బజార్ లో సోమవారం ఉదయం కనిపించిన

దృశ్యం చూస్తే కనీస దూరం అంటే ఏంటో ప్రజలకు తెలియదా అనిపిస్తోంది. లేదా పూర్తిగా వీళ్ళు కూడా ప్రజా ప్రతినిధుల లాగానే భాద్యతారాహిత్యంగానే ఉన్నారా అని

పిస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam